‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా ఎంతకీ మొదలు కాకపోవడం పట్ల అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా శంకర్ సినిమాను లైన్లో పెట్టి చకచకా లాగించేస్తుంటే.. తారక్ మాత్రం పది నెలలకు పైగా ఖాళీగా ఉండడం, ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత కూడా సినిమా మొదలుపెట్టకపోవడం ఫ్యాన్స్కు రుచించడం లేదు.
‘ఆచార్య’కు సంబంధించిన సెటిల్మెంట్ గొడవల్లో కొరటాల చిక్కుకోవడం తాజా ఆలస్యానికి కారణంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్ కొత్త చిత్రం కొరటాలతోనే ఉంటుందా లేదా అనే విషయంలోనూ సందేహాలు తలెత్తుతున్నాయి. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానాతో తారక్ కొత్త సినిమా మొదలుపెట్టాలనుకుంటున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయోమయంలో ఉన్న నందమూరి అభిమానులకు తన కొత్త చిత్రం విషయంలో జరుగుతున్న ఆలస్యంపై అతడి సోదరుడు కళ్యాణ్ రామ్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు ఓ ఇంటర్వ్యూలో.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఊహించని స్థాయికి వెళ్లిపోయిందని.. ప్రపంచ స్థాయికి చేరుకుందని.. అలాంటి సినిమా తర్వాత ఎలాంటి చిత్రం చేయాలనే విషయంలో తారక్ చాలా ఆలోచిస్తున్నాడని కళ్యాణ్ రామ్ తెలిపాడు. నిర్మాతలుగా తమ మీదా చాలా బాధ్యత ఉంటుందని.. ఆ బాధ్యత నుంచే భయం, జాగ్రత్త పుడతాయని కళ్యాణ్ రామ్ తెలిపాడు. అభిమానుల ఆతృతను అర్థం చేసుకోగలమని, వాళ్లు అప్డేట్స్ కోరుకుంటారని, కానీ ఏ అప్డేట్ ఇచ్చినా అథెంటిగ్గా ఉండాలని, అందరికీ నచ్చేలా ఉండాలని తాము భావిస్తామని కళ్యాణ్ రామ్ తెలిపాడు.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీగా పెరిగిన అంచనాలను అందుకోవడం కోసం ప్రతి విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించి కానీ ఏదీ చేయలేమని.. కాబట్టే ఆలస్యం జరుగుతోందని.. తారక్తో కొత్త సినిమా చేయబోయే దర్శకుడి మీద కూడా చాలా ఒత్తిడి ఉంటుందని.. అన్నీ జాగ్రత్తగానే జరుగుతున్నాయని.. కాబట్టి అభిమానులు కొంచెం ఓపకి పట్టాలని కళ్యాణ్ రామ్ విజ్ఞప్తి చేశాడు. తన సినిమా ‘బింబిసార’ ప్రి రిలీజ్ ఈవెంట్కు తారక్ ముఖ్య అతిథిగా వస్తున్నాడని.. అతణ్ని చూడడానికి, అలాగే తన ప్రసంగం వినడానికి అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని.. ఆ రోజు ఫోకస్ మొత్తం తనమీదే ఉండాలనే ఉద్దేశంతో సినిమాకు సంబంధించి రిలీజ్ ట్రైలర్ కూడా ముందే రిలీజ్ చేసేస్తున్నట్లు కళ్యాణ్ రామ్ వెల్లడించాడు. మరి శుక్రవారం జరిగే ‘బింబిసార’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తన కొత్త సినిమా గురించి తారక్ ఏం మాట్లాడతాడు, అభిమానులకు ఏం క్లారిటీ ఇస్తాడు అన్నది ఆసక్తికరం.
This post was last modified on July 27, 2022 2:06 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…