ఇప్పుడొస్తున్న సినిమాలకు ఏదైనా కాంట్రావర్సీ దొరికితే చాలు అదెంత ఫ్రీ పబ్లిసిటీకి ఉపయోగడపడుతుందో చూస్తున్నాం. లైగర్ కు కేవలం పోస్టర్లే సోషల్ మీడియాలో ఫ్రీ ప్రమోషన్ చేసి పెట్టాయి. కోట్ల రూపాయలు వెచ్చించినా కొనలేని ప్రచారం విజయ్ దేవరకొండ పూలగుత్తి లుక్కు తెచ్చి పెట్టింది. కానీ ప్రతిసారి ఇలా జరగదు. కొన్ని వివాదాలు నెగటివ్ ట్రెండ్ కి దారి తీస్తాయి. నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం రూపొందించిన దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు అలాంటి చిక్కులో పడటం హాట్ టాపిక్ గా మారింది.
2019 ఎన్నికల టైంలో చంద్రబాబునాయుడుకి వ్యతిరేకంగా జగన్ కి మద్దతుగా పెట్టిన కొన్ని ట్వీట్ల తాలూకు స్క్రీన్ షాట్లు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. తాను మద్దతు ఇచ్చిన పార్టీ తనది ఒకే సామజిక వర్గం కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ఎంఎస్ఆర్ అలాంటి ట్వీట్లు పెట్టారని ఇప్పుడు దాని మీదే సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే రాజశేఖర్ రెడ్డి మాత్రం వీటిని ఖండిస్తున్నారు. తన ప్రమేయం లేకుండా ఇవి చేశారని, ఫోటో షాప్ లో ఫేక్ ఎడిట్లతో తనను టార్గెట్ చేశారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
అయితే ఆ ట్వీట్లలో కొన్ని నిజమే అయినప్పటికీ భవిష్యత్తులో ఇవే తనకు ఇబ్బంది అవుతాయని బహుశా మాచర్ల దర్శకుడు ఊహించి ఉండడు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ట్వీట్ ని తాను డిలీట్ చేయనని చెబుతున్నప్పటికీ ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పుడీ వ్యవహారం మాచర్ల నియోజకవరానికి తెచ్చే మేలేమీ లేదు. ఎప్పుడైతే కుల సమీకరణాలు ఇలాంటి గొడవల్లో ఎంట్రీ ఇస్తాయో అవి పాజిటివ్ గా మారే అవకాశాలు తక్కువ. మరి రిలీజ్ కు మూడు వారాలే టైం ఉన్న నేపథ్యంలో ఇదింకెలాంటి మలుపు తీసుకుంటుందో.
This post was last modified on July 27, 2022 1:14 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…