Movie News

మాచర్ల దర్శకుడికి ట్వీట్ల తలపోటు

ఇప్పుడొస్తున్న సినిమాలకు ఏదైనా కాంట్రావర్సీ దొరికితే చాలు అదెంత ఫ్రీ పబ్లిసిటీకి ఉపయోగడపడుతుందో చూస్తున్నాం. లైగర్ కు కేవలం పోస్టర్లే సోషల్ మీడియాలో ఫ్రీ ప్రమోషన్ చేసి పెట్టాయి. కోట్ల రూపాయలు వెచ్చించినా కొనలేని ప్రచారం విజయ్ దేవరకొండ పూలగుత్తి లుక్కు తెచ్చి పెట్టింది. కానీ ప్రతిసారి ఇలా జరగదు. కొన్ని వివాదాలు నెగటివ్ ట్రెండ్ కి దారి తీస్తాయి. నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం రూపొందించిన దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు అలాంటి చిక్కులో పడటం హాట్ టాపిక్ గా మారింది.

2019 ఎన్నికల టైంలో చంద్రబాబునాయుడుకి వ్యతిరేకంగా జగన్ కి మద్దతుగా పెట్టిన కొన్ని ట్వీట్ల తాలూకు స్క్రీన్ షాట్లు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. తాను మద్దతు ఇచ్చిన పార్టీ తనది ఒకే సామజిక వర్గం కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ఎంఎస్ఆర్ అలాంటి ట్వీట్లు పెట్టారని ఇప్పుడు దాని మీదే సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే రాజశేఖర్ రెడ్డి మాత్రం వీటిని ఖండిస్తున్నారు. తన ప్రమేయం లేకుండా ఇవి చేశారని, ఫోటో షాప్ లో ఫేక్ ఎడిట్లతో తనను టార్గెట్ చేశారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

అయితే ఆ ట్వీట్లలో కొన్ని నిజమే అయినప్పటికీ భవిష్యత్తులో ఇవే తనకు ఇబ్బంది అవుతాయని బహుశా మాచర్ల దర్శకుడు ఊహించి ఉండడు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ట్వీట్ ని తాను డిలీట్ చేయనని చెబుతున్నప్పటికీ ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పుడీ వ్యవహారం మాచర్ల నియోజకవరానికి తెచ్చే మేలేమీ లేదు. ఎప్పుడైతే కుల సమీకరణాలు ఇలాంటి గొడవల్లో ఎంట్రీ ఇస్తాయో అవి పాజిటివ్ గా మారే అవకాశాలు తక్కువ. మరి రిలీజ్ కు మూడు వారాలే టైం ఉన్న నేపథ్యంలో ఇదింకెలాంటి మలుపు తీసుకుంటుందో.

This post was last modified on July 27, 2022 1:14 pm

Share

Recent Posts

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

4 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

1 hour ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

1 hour ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

4 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

5 hours ago