టాలీవుడ్ నిర్మాతలు మూకుమ్మడిగా ఆగస్ట్ 1 నుంచి షూటింగుల బందుకు పిలుపునివ్వడం ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా దీని ప్రభావం నేరుగా విడుదల తేదీల మీద పడనుంది. అనుకున్న టైంకి వేసుకున్న షెడ్యూల్స్ కి తగ్గట్టుగా పూర్తి చేస్తేనే రిలీజ్ డేట్లను మీట్ కావడం కష్టంగా ఉంది. అలాంటిది ఉన్నట్టుండి బంద్ అంటే ఎదురుకోవాల్సిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కాల్ షీట్లు, లొకేషన్ల అద్దెలు, అవుట్ డోర్ కోసం ఇచ్చిన అడ్వాన్సులు, డిస్ట్రిబ్యూటర్ల అగ్రిమెంట్లు వగైరా ఎన్నో ఇబ్బందులుంటాయి.
వచ్చే నెలతో మొదలుపెట్టి 2023 జనవరి దాకా విడుదల తేదీ లాక్ చేసుకున్నవాటికి ఇది మరింత తీవ్రం కానుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. పైగా ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ బ్యానర్లన్నీ ఇందులో పాల్గొంటున్నాయి. లిస్టులో లేని ఒకటి రెండు ప్రొడ్యూసర్ గిల్డ్ ని కాదని వ్యతికరేకంగా చిత్రీకరణలు జరపలేవు. సో మొత్తం స్తంభించిపోతుంది. కార్మికుల ఉపాధితో పాటు ఆర్టిస్టుల డేట్లు ఇరకాటంలో పడతాయి. ఒకవేళ ఈ బంద్ త్వరగా కొలిక్కి వస్తే సంతోషమే కానీ ఇంకా లేట్ అయితే మాత్రం నరకమే అవుతుంది.
ఇది ఎప్పటిదాకా కొనసాగుతుందనే దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటికే టికెట్ రేట్లకు సంబంధించి ఇంకా తగ్గించాలనే కీలక నిర్ణయం తీసేసుకున్నారు. ఆరుగురు స్టార్ హీరోలను మినహాయించి ఇతరుల రెమ్యునరేషన్లు, ఖర్చులతో ముడిపడిన కొన్ని కఠిన ఆంక్షలు తీసుకోవాల్సిన దాని మీద ఇంకా పలు దఫాల చర్చలు జరుగుతాయి. వర్కర్ల వేతనం మీద కూడా ఈ సందర్భంలోనే తేల్చేయాలి. సో నిర్మాత సమాఖ్య పరుగులు పెడుతూ సమావేశాలు నిర్వహిస్తే కానీ ఇవన్నీ కొలిక్కి రావు. చూడాలి ఏం జరగనుందో .
This post was last modified on July 27, 2022 10:05 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…