హఠాత్తుగా ఆగస్ట్ 1 నుంచి షూటింగులు ఆపేయాలని తీసుకున్న నిర్ణయం కేవలం చిత్రీకరణల మీదే కాదు పలురకాలుగా ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా పక్క బాషల ఆర్టిస్టుల డేట్లు తీసుకుని దానికి తగ్గట్టే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న నిర్మాతలు ఇరకాటంలో పడబోతున్నారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ ఫైనల్ షూట్ లో ఉన్నాడు. ఒక ఫైట్ ని హైదరాబాద్ లోనే తీస్తున్నారు. ఇంకా పూర్తవ్వలేదని యూనిట్ టాక్. ఇంకో రెండు మూడు రోజులు సమయం ఉంది కాబట్టి ఆలోగా ఫినిష్ చేస్తే మంచిదే.
ఇది కాకుండా కండల వీరుడు మెగాస్టార్ కాంబినేషన్ లో ఒక పాట షూట్ బాలన్స్ ఉంది. దాన్ని మాత్రం ముంబైలో ప్లాన్ చేసుకున్నారు. షూటింగ్స్ ఆపాలన్నది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమా లేక టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అవుట్ డోర్ లో కూడా చేయకూడదా అనేది చెప్పలేదు కానీ మాములుగా అయితే ఇది రెండింటికి వర్తిస్తుంది. ఇది నిజమైతే గాడ్ ఫాదర్ లో సల్మాన్ పార్ట్ కు సైతం బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే తిరిగి మళ్ళీ డేట్లు తీసుకోవడం పెద్ద సమస్య. ఎందుకంటే సల్లు భాయ్ కమిట్ మెంట్స్ అలాంటివి.
మరోవైపు సల్మాన్ కొత్త మూవీ కభీ ఈద్ కభీ దీవాలి షూట్ సైతం భాగ్యనగరంలోనే జరుగుతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది తెలుగు సినిమా కిందకు రాదు కానీ ఆచార్య సెట్ ని వాడుకుంటున్న తరుణంలో బయటికి వెళ్లి తీయలేరు. అక్కడే పూర్తి చేయాలి. కాకపోతే నిర్మాత హిందీ వాడు కాబట్టి మన ప్రొడ్యూసర్ గిల్డ్ పరిధిలోకి రాడు కానీ ఇక్కడి స్పాట్ లో పని చేయాల్సిన వాళ్లంతా తెలుగువాళ్ళే. మరి సల్మాన్ డేట్లను వీళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…