Movie News

ఆగస్ట్ 1 నుండి షూటింగ్ బంద్ ?

కొన్ని రోజులుగా టాలీవుడ్ బడా నిర్మాతలు మీటింగులు పెట్టుకుంటూ కొన్ని సమస్యలపై చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన మీటింగ్ లో కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్న అనంతరం ఆగస్ట్ 1 నుండి షూటింగ్స్ బంద్ అంటూ ప్రకటించారు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశమయింది. నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి కొన్ని రోజులుగా షూటింగ్ బంద్ అనే వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఫస్ట్ మీటింగ్ లోనే బంద్ మేటర్ బయటికొచ్చేసింది. కానీ దిల్ రాజు అలాంటిదేం లేదని ఇంకా మీటింగ్స్ ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్నపళంగా షూటింగ్ బంద్ అంటూ ప్రకటించారు.

కోవిడ్ తర్వాత సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంది. సక్సెస్ రేటు బాగా పడిపోయింది. కొన్ని వారాలుగా సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి తప్ప థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల హంగామా ఏమి కనిపించడం లేదు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నారు. అందుకే ప్రొడ్యుసర్ గిల్డ్ చర్చలు జరుపుకుంది. టికెట్ రేటు, ఓటీటీ డీల్, హీరోల రెమ్యునరేషన్స్, కాస్ట్ కంట్రోల్ ఇలా చాలా విషయాలపై చర్చ పెట్టుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కంటెంట్ మీద ఫోకస్ పెట్టి కరోన కి ముందు అనుకున్న ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేసుకోవడం లేదా రిపేర్లు చేసుకోవడం గురించి కూడా ఒకరికొకరు చెప్పుకున్నారు.

అయితే ఇప్పుడు ఈ మీటింగ్స్ లో భాగంగా షూటింగ్స్ బంద్ ఎందుకు పెట్టుకున్నారు ? దీని ద్వారా నిర్మాతలకు జరిగేదేమిటి ? ఒరిగెదేంటి అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా నిర్మాతల మండలి నిర్ణయం తీసేసుకుంది ఆగస్ట్ 1 నుండి ఇంప్లిమెంట్ చేయడం ఖాయం. బంద్ వల్ల ఇటు బడా సినిమాలకు అటు చిన్న చిత్రాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. అలాగే టెక్నీషియన్స్ పై బాగా ఎఫెక్ట్ పడనుంది. ప్రేక్షకుడికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. హాయిగా రిలీజయ్యే సినిమాలు చూడొచ్చు.

This post was last modified on July 26, 2022 11:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

1 hour ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

2 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

2 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

4 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

5 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

5 hours ago