కొన్ని రోజులుగా టాలీవుడ్ బడా నిర్మాతలు మీటింగులు పెట్టుకుంటూ కొన్ని సమస్యలపై చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన మీటింగ్ లో కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్న అనంతరం ఆగస్ట్ 1 నుండి షూటింగ్స్ బంద్ అంటూ ప్రకటించారు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశమయింది. నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి కొన్ని రోజులుగా షూటింగ్ బంద్ అనే వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఫస్ట్ మీటింగ్ లోనే బంద్ మేటర్ బయటికొచ్చేసింది. కానీ దిల్ రాజు అలాంటిదేం లేదని ఇంకా మీటింగ్స్ ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్నపళంగా షూటింగ్ బంద్ అంటూ ప్రకటించారు.
కోవిడ్ తర్వాత సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంది. సక్సెస్ రేటు బాగా పడిపోయింది. కొన్ని వారాలుగా సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి తప్ప థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల హంగామా ఏమి కనిపించడం లేదు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నారు. అందుకే ప్రొడ్యుసర్ గిల్డ్ చర్చలు జరుపుకుంది. టికెట్ రేటు, ఓటీటీ డీల్, హీరోల రెమ్యునరేషన్స్, కాస్ట్ కంట్రోల్ ఇలా చాలా విషయాలపై చర్చ పెట్టుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కంటెంట్ మీద ఫోకస్ పెట్టి కరోన కి ముందు అనుకున్న ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేసుకోవడం లేదా రిపేర్లు చేసుకోవడం గురించి కూడా ఒకరికొకరు చెప్పుకున్నారు.
అయితే ఇప్పుడు ఈ మీటింగ్స్ లో భాగంగా షూటింగ్స్ బంద్ ఎందుకు పెట్టుకున్నారు ? దీని ద్వారా నిర్మాతలకు జరిగేదేమిటి ? ఒరిగెదేంటి అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా నిర్మాతల మండలి నిర్ణయం తీసేసుకుంది ఆగస్ట్ 1 నుండి ఇంప్లిమెంట్ చేయడం ఖాయం. బంద్ వల్ల ఇటు బడా సినిమాలకు అటు చిన్న చిత్రాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. అలాగే టెక్నీషియన్స్ పై బాగా ఎఫెక్ట్ పడనుంది. ప్రేక్షకుడికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. హాయిగా రిలీజయ్యే సినిమాలు చూడొచ్చు.
This post was last modified on July 26, 2022 11:09 pm
ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త రిలీజ్…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…