ఎల్లుండి విడుదల కాబోతున్న ది లెజెండ్ మీద తెలుగులో అంచనాలు సున్నా. అటు తమిళంలోనూ ఎగబడి చూసేంత సీన్ కనిపించడం లేదు. సోషల్ మీడియా ట్రోలింగ్ మాత్రం కంటిన్యూ అవుతోంది. హీరో శరవణన్ మూడు రాష్ట్రాలు తిరిగి మరీ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నారు కానీ బజ్ మాత్రం రావడం లేదు. అరవై కోట్లకు పైగా బడ్జెట్ పెట్టామని నిర్మాత అంటుంటే అంతకంటే చాలా ఎక్కువయ్యిందని నిర్మాణాన్ని దగ్గరి నుంచి చూసినవాళ్లంటున్నారు. ప్యాన్ ఇండియా కాబట్టి ఖర్చు ఇంకా పెరిగింది.
ఇంత చేసినా శరవణన్ ఈ సినిమా ఫలితం పట్ల ఏ మాత్రం టెన్షన్ గా లేరట. ఎందుకంటే ఇది హిట్ అయినా డిజాస్టర్ అయినా ఆయనకు పోయేదేమీ లేదు. పది రూపాయలు పారేసుకుంటే ఎలా అయితే లైట్ తీసుకుంటామో ఒకవేళ లెజెండ్ కనక పెట్టుబడి మొత్తం పోగొట్టినా ఆయన అంతకన్నా లైట్ అనుకుంటారు. కేవలం బిగ్ స్క్రీన్ మీద తనను చూసుకోవాలన్న టార్గెట్ తోనే ఇంత ఖర్చు పెట్టి ది లెజెండ్ తీయించుకున్న శరవణన్ యాభై ఏళ్ళ వయసులో హీరోగా ఏదో పొడిచేయాలనే టార్గెట్ తో వచ్చి ఉండరుగా.
శరవణన్ సంస్థ గ్రూప్ లో సుమారు పది వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. వాళ్లంతా చూసినా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడొచ్చు. వందల మిలియన్ డాలర్ల టర్నోవర్ ఉన్న కంపెనీ అధినేతగా శరవణన్ లెజెండ్ తో ఆపకపోవచ్చని మరో ప్రచారం ఉంది,ఇది ఆడితే వెంటనే కొత్తది మొదలుపెడతారు. లేదూ పోయినా మినిమమ్ హిట్ వచ్చేదాకా నాలుగైదు తీస్తూ పోతారట. అంతేలెండి అంతులేనంత సంపద చేతిలో ఉన్నప్పుడు మనమాడిందే ఆట పాడిందే పాట. చూసేవాళ్ళు దొరకాలి అంతే. ఇంకో రెండు రోజుల్లో ఇదేంటో తేలిపోతుంది
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…