కొన్ని నెలల కిందట ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఒకప్పుడు ఒక అవార్డు కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఢిల్లీకి వెళ్తే అక్కడంతా హిందీ చిత్రాలకు సంబంధించిన ఫొటోలే కనిపించాయని, తెలుగు ఫిలిం లెజెండ్స్ ఎవరికీ అక్కడ స్థానం లేదని.. అది చూసి తాను ఎంతో బాధ పడ్డానని.. కానీ ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకుల వల్ల తెలుగు సినిమా తలెత్తుకుని నిలబడుతోందని.. మన సినిమాకు ఇప్పుడు గొప్ప ప్రాధాన్యం దక్కుతోందని పేర్కొన్నాడు.
కాగా ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్వయంగా మన సినిమా ఎదుగుదల గురించి, బాలీవుడ్ ఎంత తగ్గి వ్యవహరించాల్సి వస్తోందనే విషయమై హైదరాబాద్లో జరిగిన తన సినిమా లాల్ సింగ్ చడ్డా ప్రెస్ మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో చిరు ఆవేదన గురించి ఆమిర్ ఈ కార్యక్రమంలో ప్రస్తావించడం విశేషం.
హిందీలో సౌత్ సినిమాల హవా గురించి ఒక విలేకరి ఆమిర్ను ప్రశ్నించగా అతను బదులిస్తూ.. ‘‘కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు ప్రేక్షకుల మనసులను దోచాయి. ఈ రోజు తెలుగు సినిమా చాలా గొప్ప స్థాయికి ఎదిగింది. దక్షిణాది తారలకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఢిల్లీలో చిరంజీవిని కదిలించిన ఉదంతం గురించి నాకు గుర్తుంది. కానీ ఈ రోజు ఒక హిందీ స్టార్గా నేను చిరంజీవి గారి ఆశీర్వాదం కోసం, నా సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి వచ్చాను. ఒక రాష్ట్రం నుంచి వస్తున్న సినిమాలు దేశవ్యాప్తంగా అందరినీ మెప్పిస్తుండటం గొప్ప విషయం’’ అని పేర్కొన్నాడు.
తాను చిరంజీవి ఆశీర్వాదం, సాయం కోసం వచ్చానని ఆమిర్ పేర్కొనగా.. పక్కనే ఉన్న చిరంజీవి చాలా ఆప్యాయంగా అతణ్ని చూస్తూ దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. ఆమిర్ మాటలు, ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకున్నాయి. చాలా ఏళ్ల పాటు దేశంలో నంబర్ వన్ హీరోగా కొనసాగిన ఆమిర్.. తెలుగు సినిమా గురించి ఈ స్థాయిలో పొగడ్డం గొప్ప విషయమే.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…