కొన్ని నెలల కిందట ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఒకప్పుడు ఒక అవార్డు కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఢిల్లీకి వెళ్తే అక్కడంతా హిందీ చిత్రాలకు సంబంధించిన ఫొటోలే కనిపించాయని, తెలుగు ఫిలిం లెజెండ్స్ ఎవరికీ అక్కడ స్థానం లేదని.. అది చూసి తాను ఎంతో బాధ పడ్డానని.. కానీ ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకుల వల్ల తెలుగు సినిమా తలెత్తుకుని నిలబడుతోందని.. మన సినిమాకు ఇప్పుడు గొప్ప ప్రాధాన్యం దక్కుతోందని పేర్కొన్నాడు.
కాగా ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్వయంగా మన సినిమా ఎదుగుదల గురించి, బాలీవుడ్ ఎంత తగ్గి వ్యవహరించాల్సి వస్తోందనే విషయమై హైదరాబాద్లో జరిగిన తన సినిమా లాల్ సింగ్ చడ్డా ప్రెస్ మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో చిరు ఆవేదన గురించి ఆమిర్ ఈ కార్యక్రమంలో ప్రస్తావించడం విశేషం.
హిందీలో సౌత్ సినిమాల హవా గురించి ఒక విలేకరి ఆమిర్ను ప్రశ్నించగా అతను బదులిస్తూ.. ‘‘కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు ప్రేక్షకుల మనసులను దోచాయి. ఈ రోజు తెలుగు సినిమా చాలా గొప్ప స్థాయికి ఎదిగింది. దక్షిణాది తారలకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఢిల్లీలో చిరంజీవిని కదిలించిన ఉదంతం గురించి నాకు గుర్తుంది. కానీ ఈ రోజు ఒక హిందీ స్టార్గా నేను చిరంజీవి గారి ఆశీర్వాదం కోసం, నా సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి వచ్చాను. ఒక రాష్ట్రం నుంచి వస్తున్న సినిమాలు దేశవ్యాప్తంగా అందరినీ మెప్పిస్తుండటం గొప్ప విషయం’’ అని పేర్కొన్నాడు.
తాను చిరంజీవి ఆశీర్వాదం, సాయం కోసం వచ్చానని ఆమిర్ పేర్కొనగా.. పక్కనే ఉన్న చిరంజీవి చాలా ఆప్యాయంగా అతణ్ని చూస్తూ దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. ఆమిర్ మాటలు, ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకున్నాయి. చాలా ఏళ్ల పాటు దేశంలో నంబర్ వన్ హీరోగా కొనసాగిన ఆమిర్.. తెలుగు సినిమా గురించి ఈ స్థాయిలో పొగడ్డం గొప్ప విషయమే.
This post was last modified on July 25, 2022 4:04 pm
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం జగన్ తొలిసారి బయటకు వచ్చారు. విజయవాడలోని ఐ-ప్యాక్ ఆఫీసును జగన్ సందర్శించారు.…
ఒకేసారి ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన రెండు వేర్వేరు ప్యాన్ ఇండియా సినిమాలతో గ్రాండ్ టాలీవుడ్…
నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…