వేరే సినిమాల ప్రమోషన్ల విషయంలో తన సాయం కోరి ఎవరు వచ్చినా మెగాస్టార్ చిరంజీవి అసలు కాదనట్లేదు ఈ మధ్య. అనధికార ఇండస్ట్రీ పెద్ద పాత్ర పోషిస్తున్న ఆయన.. తాజాగా ఒక హిందీ చిత్రాన్ని తెలుగులో ప్రమోట్ చేసే బాధ్యతను నెత్తికెత్తున్నారు. ఆ చిత్రమే.. లాల్ సింగ్ చడ్డా. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది.
హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్కు రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించడంతో తెలుగులో దీనికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ఆమిర్ కూడా తెలుగు ప్రమోషన్ల మీద బాగానే దృష్టిపెట్టాడు. చిరంజీవి ఈ సినిమాను సమర్పించేలా ఒప్పించారు. ఇప్పటికే ఆయనకు స్పెషల్ ప్రివ్యూ వేసి సినిమా చూపించారు. ఆదివారం చిరు, చైతూలతో కలిసి ఆమిర్ హైదరాబాద్లో మీడియాను కలిసి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. ఆమిర్, చిరు, చైతూ కలిసి ఈ ఈవెంట్లో స్టేజ్ మీద పానీ పూరీలు తినడం విశేషం. లాల్ సింగ్ చడ్డా ట్రైలర్లో ఆమిర్ ట్రైన్లో కూర్చుని పానీ పూరీలు తినే దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. ట్రైన్లో పానీ పూరీలేంటి అని కొందరు కౌంటర్లు వేసినప్పటికీ.. ఆ సీన్ ఆసక్తికరంగా అనిపించింది. ఇప్పుడు ప్రమోషన్ కోసమని ఆ సీన్ను రీక్రియేట్ చేశారు. పానీపూరీలు తెప్పించి స్టేజ్ మీదే తిన్నారు.
చైతూ తన పాటికి తాను పూరీ తింటే.. చిరు, ఆమిర్ ఒకరికొకరు తినిపించుకోవడం విశేషం. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమిర్ సొంత బేనర్లో తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డాను అతడి మాజీ మేనేజర్, సీక్రెట్ సూపర్ స్టార్ మూవీతో దర్శకుడిగా మారిన అద్వైత్ చంద్ డైరెక్ట్ చేశాడు. ఇందులో కరీనా కపూర్ కథానాయికగా నటించింది. ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని వివిధ దశల్లో చూపించే సినిమా ఇది. దీని ఒరిజినల్లో టామ్ హాంక్స్ హీరోగా నటించాడు.
This post was last modified on July 25, 2022 7:24 am
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. నిన్న ఒకే రోజు ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చినప్పటికీ.. దేశమంతా ఎక్కువ…
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…
దక్షిణాది సినీ రంగంలో ఒక ధృవతార రాలిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి కన్ను…