Odia actor, wife, co-actor fight on Bhubaneswar street, video goes viral.
సినిమా హీరోలు ఇంట్లో భార్య ఉన్నా తమతో కలిసి పని చేసే కథానాయికలతో ఎఫైర్లు నడపడం కొత్తేమీ కాదు. ఇలాంటి వ్యవహారాలు ఇండస్ట్రీ జనాలకు చాలా మామూలుగా అనిపిస్తుంటాయి. ఇలాంటి విషయాల్లో ఏవైనా గొడవలు తలెత్తితే అవి నాలుగ్గోడలకే పరిమితం అవుతుంటాయి. కానీ ఒరిస్సాలో ఒక సినిమా హీరో ఎఫైర్ వ్యవహారం రోడ్డు మీదికి వచ్చి రచ్చ రచ్చగా మారింది.
ఆ హీరో పేరు.. బబూషన్ మొహంతి. అతను ప్రకృతి మిశ్రా అనే స్టార్ హీరోయిన్తో ఒక సినిమాలో కలిసి నటించాడు. ప్రకృతి అక్కడ ఫేమస్ హీరోయినే. ఈ సినిమాలో కలిసి నటించిన సందర్భంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అక్కడి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ఐతే బబూషణ్కు ఆల్రెడీ పెళ్లయింది. తన భార్య పేరు తృప్తి సత్పతి. ఆమెకు బబూషణ్, ప్రకృతిల వ్యవహారం తెలిసి ఫాలో అప్ చేయడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి కార్లో భువనేశ్వర్లో తిరుగుతున్నట్లు తెలుసుకుంది.
ఆలస్యం చేయకుండా బబూషణ్, ప్రకృతి ఉన్న చోటికి వచ్చేసి ఇద్దరినీ కార్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామె. నడి రోడ్డు మీద కారు ఆపి, కార్లోకి దూరిన తృప్తి.. నా భర్తతో ఎఫైర్ పెట్టుకుంటావా అని ప్రకృతితో గొడవకు దిగింది. ఆమె జుట్టు పట్టుకుని లాగుతూ, కొడుతూ దుర్భాషలాడింది. అంతలో అక్కడికి జనం వచ్చారు. సెలబ్రెటీ వ్యవహారం కావడంతో వీడియోలు తీయడం మొదలుపెట్టారు.
అందులో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో ప్రకృతి జుట్టు పట్టుకుని లాగుతూ తృప్తి దుర్భాషలాడుతున్న దృశ్యం కనిపించింది. ఆమె నుంచి తప్పించుకుని ప్రకృతి పరుగులు తీయడం.. తన వెంట తృప్తి పరుగులు పెట్టడం, ప్రకృతి ఆటో ఎక్కి అక్కడి నుంచి పలాయనం చిత్తగించడం కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తృప్తి చేసింది కరక్టే అని కొందరంటే.. మరీ రోడ్డు మీద ఇలా గొడవ పడడమేంటి అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై సదరు హీరో మీడియాకు ఏమని బదులిస్తాడో చూడాలి.
This post was last modified on July 25, 2022 7:23 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…