మొన్నటిదాకా డైరెక్ట్ ఓటిటి రిలీజులంటే ఉన్న చిన్నచూపు రెండు రోజుల క్రితం ప్రకటించిన జాతీయ అవార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వమే తగ్గించడం అప్ కమింగ్ ఫిలిం మేకర్స్ కి కొండంత ఉత్సాహాన్ని ఇస్తోంది.
కలర్ ఫోటోకి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా పురస్కారం దక్కడం, ఆకాశం నీ హద్దురా(సూరారై పోట్రు)కు హీరో సూర్యతో పాటు మొత్తం అయిదు విభాగాల్లో ఈ గౌరవం దక్కడం రాబోయే రోజుల్లో డిజిటల్ విడుదలకు అర్థాన్ని మార్చేలా ఉంది. థియేటర్లో రాకపోయినా మన సత్తా ప్రపంచానికి చాటవచ్చనే నమ్మకాన్ని కలిగించింది.
కలర్ ఫోటో తీసింది చాలా చిన్న టీమ్. దర్శకుడు సందీప్ రాజ్ కొత్తవాడు. నిర్మాత రాజేష్ కున్న అనుభవమూ తక్కువే. ఇక కథానాయకుడు సుహాస్ అప్పటిదాకా చేసింది సపోర్టింగ్ రోల్సే. షార్ట్ ఫిలింస్ లో నటించే చాందిని చౌదరి హీరోయిన్. ఇన్ని అంశాల్లో రాజీ పడిన ఈ సినిమాలో కంటెంట్, దాన్ని ప్రెజెంట్ చేయడంలో నిజాయితీ నేషనల్ కమిటీని మెప్పించింది. ఊహించని స్థాయిలో సత్కరించింది. ఆకాశం నీ హద్దురా అంటే సూర్య లాంటి స్టార్ హీరో, సుధా కొంగర లాంటి ప్రూవ్డ్ డైరెక్టర్ కాబట్టి కలర్ ఫోటోతో పోల్చలేం.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. దమ్మున్న కథలు మెప్పించే కథనాలు మనదగ్గరుంటే ఎక్కడైనా విజయం సాధించవచ్చు అనేదానికి ఇవే ఉదాహరణలు. బిగ్ స్క్రీన్ మీద పేరు చూసుకుంటే చాలనుకునే దర్శక నిర్మాతలెందరో రిస్కులు చేసి థియేట్రికల్ బిజినెస్ లో నష్టాలు తెచ్చుకుంటున్నారు. అందరూ సక్సెస్ కాలేకపోతున్నారు. అలాంటి వాళ్లకు కలర్ ఫోటో విజయం స్ఫూర్తినిచ్చేదే. 2021 లిస్టులో ఖచ్చితంగా జైభీమ్ తో పాటు మరికొన్ని ఓటిటి రిలీజులు అవార్డులు గెలవడం ఖాయమనే క్లారిటీ వచ్చేసింది. రాబోయే రోజుల్లో దీన్నింకా బాగా అర్థం చేసుకోవాల్సింది అప్ కమింగ్ ప్రొడ్యూసర్లే.
This post was last modified on July 25, 2022 6:55 am
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని…
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…