ఒకప్పుడు శాటిలైట్ ఛానల్ లో వచ్చిన కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం ఇంటర్వ్యూలలోనే ఒక కొత్త ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన మాట వాస్తవం. దాని స్ఫూర్తితోనే తెలుగులోనూ మంచు లక్ష్మి, రానాలాంటి వాళ్ళు సెలబ్రిటీ ముఖాముఖీలతో మంచి పేరు తెచ్చుకున్నారు . దీన్నే ఇప్పుడు కరణ్ జోహార్ డిస్నీ హాట్ స్టార్ కోసం ఓటిటిలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఊరికే స్టార్లను తీసుకొచ్చి మాట్లాడిస్తే జనం చూడరని గుర్తించిన మేకర్స్ దానికి అదనంగా ఎవరిని తీసుకొచ్చి ఎలాంటి ప్రశ్నలు అడిగితే వైరల్ అవుతుందో అవే చేస్తున్నారు.
అందుకు తగ్గట్టే సమంతా ఎపిసోడ్ ఓ రేంజ్ లో హిట్టు కొట్టి మిలియన్ల వ్యూస్ తెచ్చిపెడుతోంది. ఇటీవలే స్ట్రీమింగ్ జరిగిన ఈ ఎపిసోడ్ కి మాములు రీచ్ రాలేదు. ముఖ్యంగా మన తెలుగు ఫ్యాన్స్ సైతం ఎగబడి చూస్తున్నారు. దానికి కారణం విడాకులు తీసుకున్నాక సామ్ వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలను ఓపెన్ గా కెమెరా ముందు ప్రస్తావించిన కార్యక్రమం ఇదే. చైతుని మాజీ భర్తని సంబోధించడం, విడిపోయాక లైఫ్ పట్ల తనకెలాంటి దృక్పథం వచ్చిందో సమంతా వివరించడం ఇదంతా రీచ్ పెంచుతోంది
అంతే కాదు అక్షయ్ కుమార్ తో కలిసి చేసిన పుష్పలో ఊ అంటావా ఊహూ అంటావా డాన్స్ బిట్ సైతం వీడియో రూపంలో ఎక్కడికో వెళ్లిపోయింది. మీడియాని కలవాల్సి వచ్చినప్పుడు నాగచైతన్య గతాన్ని గుర్తుచేసుకునేందుకు ఇష్టపడకపోగా సామ్ మాత్రం చాలా స్పష్టంగా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పేయడం విశేషం. అయినా ఎప్పుడో జరిగిపోయిన తెగతెంపుల పంచాయితీ ఆయా కుటుంబాలకు అవసరం లేకపోయినా ఆదాయం కోసం యాప్స్ కి, టైం పాస్ కి నెటిజెన్లకు కావాలి. ఆ ఉద్దేశాలు ఇదిగో ఈ విధంగా నెరవేరుతున్నాయి.
This post was last modified on July 24, 2022 12:24 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…