తన అభిమానుల కోసం ప్రభాస్ ఒళ్ళు హూనం చేసుకుంటూ పగలు రేయి తేడా లేకుండా ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగైదు సినిమాలు ఒప్పేసుకుని నాన్ స్టాప్ గా కష్టపడటం అందరం చూస్తున్నాం. కానీ తమ హీరో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా సరైన రీతిలో వాటి ప్రమోషన్లు జరగకపోవడం పట్ల ఫ్యాన్స్ ఎప్పటి నుంచి అసంతృప్తికి గురవుతూనే ఉన్నారు. ఆది పురుష్ షూటింగ్ పూర్తయిందన్నారు. కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో ఇవాళ సోషల్ మీడియాలో మేలుకో ఓంరౌత్ అంటూ కొత్త తరహా ట్రెండింగ్ మొదలుపెట్టారు.
ఇక్కడితో ఆగిపోలేదు. ఇండస్ట్రీకి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కృష్ణంరాజు గారని ఆయన తర్వాత పెదనాన్న వారసత్వాన్ని అందిపుచ్చుకుని రెబెల్ స్టార్ బిరుదుకి న్యాయం చేకూరుస్తున్నది ప్రభాస్ ఒక్కడేనని ఛత్రపతి, బిల్లా తదితర సినిమాల వీడియోలను ట్వీట్ చేస్తున్నారు. కొందరు ఏకంగా విక్రమ్ మూవీలోని సూర్య రోలెక్స్ ట్రాక్ ని డార్లింగ్ కి వాడేసి మరీ ఎలివేషన్లు ఇస్తున్నారు. సాహో, రాధే శ్యామ్ ల ఫలితాల తర్వాత బాగా నిరాశలో ఉన్న ఫ్యాన్స్ చేస్తున్న ఈ హంగామా వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాల్సింది నిర్మాతలే.
ఈ క్యాంపైన్ లో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం ఒకటుంది. 2023 సంక్రాంతికి ఆది పురుష్ లేదా సలార్ లో ఏదో ఒకటి రిలీజ్ అవుతుందా లేదానే క్లారిటీ ఇస్తే దానికి తగ్గట్టు సిద్ధపడతామని అడుగుతున్నారు. కానీ రెండు యూనిట్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అప్పుడప్పుడు తన ఇంటికి వచ్చిన హీరో ఫోటోలు పెట్టడం తప్ప ఓంరౌత్ చేస్తున్నదేమి లేదు. కెజిఎఫ్ వచ్చి 100 రోజులు దాటాక కూడా ప్రశాంత్ నీల్ సలార్ మూవీ గురించి నోరు విప్పడం లేదు. మరి అభిమానులు ఈ మాత్రం ఫైర్ అవ్వడంలో తప్పేం లేదుగా.
This post was last modified on July 26, 2022 8:53 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…