అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా మీద మాములు అంచనాలు లేవు. ఇప్పటికే బిజినెస్ డీల్స్ హాట్ హాట్ గా జరుగుతున్నాయని ట్రేడ్ రిపోర్ట్. మైత్రి నిర్మాతలు ఇంకా క్లోజ్ చేయలేదు కానీ బయ్యర్లు మాత్రం ఫ్యాన్సీ ఆఫర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం దీని షూటింగ్ కర్నూలుతో పాటు పరిసర గ్రామాల్లో రెండు రోజులుగా జరుగుతోంది. ఎన్నో ఏళ్ళ తర్వాత అన్నగారి వారసుడు రావడంతో అక్కడి అభిమానులను ఆపడం పోలీసులతో సహా ఎవరి వల్ల కావడం లేదు
సరే ఆయనా ఫ్యాన్స్ కదాని నో అనకుండా దగ్గరికొచ్చిన వాళ్ళకు ఫోటోలు ఇస్తున్నారు. షూట్ జరుగుతున్న ప్రాంగణంలో అనుమతిస్తున్నారు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. చిత్రీకరణకు సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు ఎంచక్కా సోషల్ మీడియాలో తిరిగేస్తున్నాయి. ఇవాళ ‘జై బాలయ్య జై జై బాలయ్య’ అంటూ వందలాది డాన్సర్ల మధ్య నడుచుకుంటూ వచ్చే పాటని పూడిచర్ల గ్రామ పరిసరాల్లో తీస్తున్నారు. ఇంకేముంది అత్యుత్సాహంతో ఓ అభిమాని తీసిన వీడియో బయటికి వచ్చి చక్కర్లు కొడుతోంది. గతంలో ఇక్కడే సమరసింహారెడ్డి షూటింగ్ చేశారు.
అసలే జై బాలయ్య అనే టైటిల్ దీనికి ఫిక్స్ చేస్తారనే లీక్ ఎప్పుడో వచ్చింది. దానికి బలమిచ్చేలా ఇప్పుడీ వీడియోలో స్పష్టంగా వినిపించేలా ఆడియో కూడా బయటికి రావడంతో అదే ఖాయం చేశారేమో అనిపిస్తోంది. అయినా స్పాట్ లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి లీకులు ఎవరికైనా తప్పవు. విపరీతమైన ఆంక్షలు పెట్టినా కూడా రాజమౌళి అంతటి వారే ఆర్ఆర్ఆర్ లీక్స్ బయటికి రాకుండా ఆపలేకపోయారు. అయినా ఈ బాలయ్య సినిమాకు ముందు నుంచి ఇదే జరుగుతోంది.రెండు నెలల క్రితం ఫస్ట్ లుక్ అఫీషియల్ గా బయటికి రాకుండానే లీకవ్వడంతో మేకర్స్ అధికారికంగా అనుకున్న టైంకన్నా కాస్త ముందుగానే వదలాల్సి వచ్చింది. తప్పదు మరి
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…