జనాలు ఎలాంటి సినిమాలకు థియేటర్లకు వస్తారో అర్థం కాక తలలు పండిన నిర్మాతలే బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటే మరోవైపు చిన్నా చితకా చిత్రాలు ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ మీద దాడి చేస్తూనే ఉన్నాయి. తాము కొనాలంటే ఖచ్చితంగా హాళ్లలో రిలీజ్ అయ్యుండాలనే కొన్ని ఓటిటిల కండీషన్లు కావొచ్చు, లేదా ఏ పుట్టలో ఏ పాముందో తరహాలో ఆడుతుందేమోననే నమ్మకం ఉండొచ్చు ఏదైతేనేం ఎగ్జిబిటర్లకు ప్రేక్షకులకు నాలుగైదు ఆప్షన్లు ఉండేలా ప్రతి ఫ్రైడే విడుదల లిస్టు పెరుగుతూ పోతోంది. వాటిలో వచ్చిందే నిన్నటి దర్జా.
అనసూయని విలన్ ని చేసి హీరో హీరోయిన్ లేకుండా ఆమెనే సర్వంగా చూపిస్తూ దర్శకుడు సలీం మాలిక్ చేసిన విచిత్ర ప్రయోగమిది. సునీల్ ని ఒక ప్రత్యేక పాత్రలో తీసుకుని కొంచెం బజ్ జోడించే ప్రయత్నం చేశారు. పుష్పలో జంటగా చేశారు కాబట్టి ఇందులో కూడా ఏదో ఒక రూపంలో కాంబోగా చేస్తే మాస్ అట్రాక్ట్ అవుతారనే ఆలోచన కావొచ్చు. మొత్తానికి దర్జా కేవలం మాస్ ని టార్గెట్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగచైతన్య అంత స్టార్డం ఉన్న హీరోకే నిన్న ఓపెనింగ్స్ లేవంటే పెద్దగా అంచనాలే లేని దర్జాకు ఎలా ఉంటాయో వేరే చెప్పాలా.
ఓ ఇరవై ఏళ్ళ క్రితం రియల్ స్టార్ శ్రీహరి ఇలాంటి ఊరనాటు సినిమాల్లో నటించేవారు. కాకపోతే ఆయన ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల కథా కథనాల క్వాలిటీ కొంచెం అటుఇటుగా ఉన్నా కమర్షియల్ గా సక్సెస్ సాధించినవే ఎక్కువ. కానీ దర్జాకు ఆ అవకాశం లేదు. ఒక లేడీ డాన్, ఆమె తమ్ముడి చావు, దాన్ని చుట్టూ మర్డర్ మిస్టరీ, అది ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్. ఇందులో ఇదే మెయిన్ పాయింట్. అనసూయ సునీల్ లు ఎంత కష్టపడినా అసలు మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడు మాస్ కైనా నచ్చే ఛాన్స్ ఎక్కడుంటుంది. వీళ్లిద్దరి కోసం ఎలా ఉన్నా చూస్తాం అనే వీరాభిమానుల తప్ప దర్జా ఎవరికీ ఛాయస్ గా కనిపించడం లేదు,
This post was last modified on July 24, 2022 10:45 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…