జనాలు ఎలాంటి సినిమాలకు థియేటర్లకు వస్తారో అర్థం కాక తలలు పండిన నిర్మాతలే బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటే మరోవైపు చిన్నా చితకా చిత్రాలు ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ మీద దాడి చేస్తూనే ఉన్నాయి. తాము కొనాలంటే ఖచ్చితంగా హాళ్లలో రిలీజ్ అయ్యుండాలనే కొన్ని ఓటిటిల కండీషన్లు కావొచ్చు, లేదా ఏ పుట్టలో ఏ పాముందో తరహాలో ఆడుతుందేమోననే నమ్మకం ఉండొచ్చు ఏదైతేనేం ఎగ్జిబిటర్లకు ప్రేక్షకులకు నాలుగైదు ఆప్షన్లు ఉండేలా ప్రతి ఫ్రైడే విడుదల లిస్టు పెరుగుతూ పోతోంది. వాటిలో వచ్చిందే నిన్నటి దర్జా.
అనసూయని విలన్ ని చేసి హీరో హీరోయిన్ లేకుండా ఆమెనే సర్వంగా చూపిస్తూ దర్శకుడు సలీం మాలిక్ చేసిన విచిత్ర ప్రయోగమిది. సునీల్ ని ఒక ప్రత్యేక పాత్రలో తీసుకుని కొంచెం బజ్ జోడించే ప్రయత్నం చేశారు. పుష్పలో జంటగా చేశారు కాబట్టి ఇందులో కూడా ఏదో ఒక రూపంలో కాంబోగా చేస్తే మాస్ అట్రాక్ట్ అవుతారనే ఆలోచన కావొచ్చు. మొత్తానికి దర్జా కేవలం మాస్ ని టార్గెట్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగచైతన్య అంత స్టార్డం ఉన్న హీరోకే నిన్న ఓపెనింగ్స్ లేవంటే పెద్దగా అంచనాలే లేని దర్జాకు ఎలా ఉంటాయో వేరే చెప్పాలా.
ఓ ఇరవై ఏళ్ళ క్రితం రియల్ స్టార్ శ్రీహరి ఇలాంటి ఊరనాటు సినిమాల్లో నటించేవారు. కాకపోతే ఆయన ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల కథా కథనాల క్వాలిటీ కొంచెం అటుఇటుగా ఉన్నా కమర్షియల్ గా సక్సెస్ సాధించినవే ఎక్కువ. కానీ దర్జాకు ఆ అవకాశం లేదు. ఒక లేడీ డాన్, ఆమె తమ్ముడి చావు, దాన్ని చుట్టూ మర్డర్ మిస్టరీ, అది ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్. ఇందులో ఇదే మెయిన్ పాయింట్. అనసూయ సునీల్ లు ఎంత కష్టపడినా అసలు మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడు మాస్ కైనా నచ్చే ఛాన్స్ ఎక్కడుంటుంది. వీళ్లిద్దరి కోసం ఎలా ఉన్నా చూస్తాం అనే వీరాభిమానుల తప్ప దర్జా ఎవరికీ ఛాయస్ గా కనిపించడం లేదు,
This post was last modified on July 24, 2022 10:45 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…