నిన్న ప్రకటించిన 2020 జాతీయ అవార్డుల్లో అల వైకుంఠపురములోకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ ఎంపిక కావడం అభిమానులకు మాములు కిక్ ఇవ్వలేదు. ఇండియన్ ఆస్కార్ గా చెప్పుకునే ఈ పురస్కారాలకు అంత విలువుంది మరి. పైగా దేశవ్యాప్తంగా వచ్చిన సినిమాల మ్యూజిక్ అన్నిటితోనూ పోటీ పడి విజేతగా నిలవడం చిన్న విషయం కాదు. ఏదైనా ఆల్బమ్ లో ఒకటి రెండు పాటలు బాగుంటేనే గొప్పనుకునే ట్రెండ్ లో ఏకంగా అయిదు పాటలను ఛార్ట్ బస్టర్స్ చేసి యుట్యూబ్ ని షేక్ చేయడం తమన్ కే చెల్లింది.
ఇక తమన్ కి ఇది ప్రత్యేకం అని చెప్పడానికి కారణం ఉంది. ఇప్పటిదాక జాతీయ స్థాయిలో సంగీతానికి ఈ గౌరవం దక్కించుకున్న వాళ్ళు తెలుగులో ఆరుగురే ఉన్నారు. శంకరాభరణం(1980)కు మామ కెవి మహదేవన్, మేఘసందేశం(1982)కు రమేష్ నాయుడు, సాగరసంగమం- రుద్రవీణ (1988)కు ఇళయరాజా, అన్నమయ్య(1997)కు కీరవాణి, స్వరాభిషేకం(2004)కు విద్యాసాగర్, మా బంగారు తల్లి(2013)కి శంతను మొయిత్రాలు మాత్రమే టాలీవుడ్ నుంచి నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తమన్ తన మొదటి ప్రౌడ్ మూమెంట్ దక్కించుకున్నాడు.
దశాబ్దాల తెలుగు సినిమా ప్రస్థానంలో ఇప్పటిదాకా ఈ పురస్కారం అందుకున్న వాళ్ళు పట్టుమని పది కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా మన టాలెంట్ వైపు ప్రపంచం మొత్తం చూస్తున్న తరుణంలో ఇప్పుడిది జరగడం ఆహ్వానించదగ్గదే. రాబోయే రోజుల్లో ఈ కౌంట్ త్వరగానే పెరిగే సూచనలున్నాయి. అసలు తమన్ ఫామ్ అమాంతం ఎగబాకిందే అల వైకుంఠపురములో నుంచి. ప్రస్తుతం ఇతని చేతిలో గాడ్ ఫాదర్, వారసుడు, రామ్ చరణ్-శంకర్, శివ కార్తికేయన్ ప్రిన్స్, మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబో మూవీ లాంటి క్రేజీ ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. ఇప్పుడీ ఉత్సాహంతో ఇంకెంత రచ్చ చేస్తాడో.
This post was last modified on July 23, 2022 3:03 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…