Movie News

నాగ్ ‘థాంక్యూ’ ఎందుకు చెప్పలేదు ?

నాగ చైతన్య తో దిల్ రాజు ఎట్టకేలకు రెండో సినిమా చేశాడు. అక్కినేని కుర్ర హీరోని ‘జోష్’ తో హీరోగా లాంచ్ చేసిన దిల్ రాజు ఆ సినిమా తర్వాత చైతూ ఇంత వరకూ చేయలేదు. అతనికి సూపర్ హిట్ ఇచ్చే కథ కోసం ఇన్నాళ్ళు వేచి చూశారు. రైటర్ కం డైరెక్టర్ బీవీఎస్ రవి ఓ లైన్ చెప్పగానే ఎగ్జైట్ అయ్యాడు. వెంటనే స్క్రిప్ట్ రెడీ చేయించి దాన్ని ఫైనల్ గా విక్రమ్ కే కుమార్ చేతిలో పెట్టారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు సంబంధించి ఎక్కడా నాగార్జున కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా నాగ్ హాజరు కాలేదు. అదే ఇప్పుడు అందరిలో డౌట్ క్రియేట్ చేస్తోంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అక్కినేని అభిమానులు నాగార్జున ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకురావాలని అడిగారు. దానికి చైతు పర్మీషణ్ తీసుకోకుండా మాకు ఒకే చైతూ కి కూడా ఓకె. నాగార్జున గారు వస్తారు అన్నట్టుగా మాట ఇచ్చారు. కానీ తీసుకురాలేకపోయారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ కి ముందు నాగ్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో జస్ట్ కనిపించి ఉంటే ఎలాంటి డిస్కషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు నాగ్ రాలేదు కాబట్టి రిజల్ట్ ఆయనకీ ముందే తెలిసిపోయిందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

సినిమా టాక్ ఎలా ఉన్నా చైతన్య కి మంచి మార్కులు పడ్డాయి. మూడు లుక్స్ తో బాగా నటించాడని మాట్లాడుకుంటున్నారు. ఇక రేపో మాపో యూనిట్ ఎలానో ఓ సక్సెస్ మీట్ పెట్టి ఆడియన్స్ కి థాంక్యూ చెప్పుకుంటారు. మరి అక్కడైనా నాగ్ కనిపిస్తారా ? ఒకవేళ నాగ్ సక్సెస్ మీట్ కి వచ్చి దిల్ రాజు కి ఫార్మాలిటీకీ అయినా థాంక్యూ చెప్తే ఇక ఎలాంటి డిస్కషన్స్ ఉండవు. లేదంటే చైతూ థాంక్యూ సినిమా చేయడం నాగ్ ఇష్టం లేదేమో అన్న ప్రశ్నలు ఇలానే కొనసాగుతాయి.

This post was last modified on July 22, 2022 7:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago