నాగ చైతన్య తో దిల్ రాజు ఎట్టకేలకు రెండో సినిమా చేశాడు. అక్కినేని కుర్ర హీరోని ‘జోష్’ తో హీరోగా లాంచ్ చేసిన దిల్ రాజు ఆ సినిమా తర్వాత చైతూ ఇంత వరకూ చేయలేదు. అతనికి సూపర్ హిట్ ఇచ్చే కథ కోసం ఇన్నాళ్ళు వేచి చూశారు. రైటర్ కం డైరెక్టర్ బీవీఎస్ రవి ఓ లైన్ చెప్పగానే ఎగ్జైట్ అయ్యాడు. వెంటనే స్క్రిప్ట్ రెడీ చేయించి దాన్ని ఫైనల్ గా విక్రమ్ కే కుమార్ చేతిలో పెట్టారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు సంబంధించి ఎక్కడా నాగార్జున కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా నాగ్ హాజరు కాలేదు. అదే ఇప్పుడు అందరిలో డౌట్ క్రియేట్ చేస్తోంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అక్కినేని అభిమానులు నాగార్జున ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకురావాలని అడిగారు. దానికి చైతు పర్మీషణ్ తీసుకోకుండా మాకు ఒకే చైతూ కి కూడా ఓకె. నాగార్జున గారు వస్తారు అన్నట్టుగా మాట ఇచ్చారు. కానీ తీసుకురాలేకపోయారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ కి ముందు నాగ్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో జస్ట్ కనిపించి ఉంటే ఎలాంటి డిస్కషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు నాగ్ రాలేదు కాబట్టి రిజల్ట్ ఆయనకీ ముందే తెలిసిపోయిందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
సినిమా టాక్ ఎలా ఉన్నా చైతన్య కి మంచి మార్కులు పడ్డాయి. మూడు లుక్స్ తో బాగా నటించాడని మాట్లాడుకుంటున్నారు. ఇక రేపో మాపో యూనిట్ ఎలానో ఓ సక్సెస్ మీట్ పెట్టి ఆడియన్స్ కి థాంక్యూ చెప్పుకుంటారు. మరి అక్కడైనా నాగ్ కనిపిస్తారా ? ఒకవేళ నాగ్ సక్సెస్ మీట్ కి వచ్చి దిల్ రాజు కి ఫార్మాలిటీకీ అయినా థాంక్యూ చెప్తే ఇక ఎలాంటి డిస్కషన్స్ ఉండవు. లేదంటే చైతూ థాంక్యూ సినిమా చేయడం నాగ్ ఇష్టం లేదేమో అన్న ప్రశ్నలు ఇలానే కొనసాగుతాయి.
This post was last modified on July 22, 2022 7:59 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…