ఓటిటీ గేమ్ లో పెద్ద పెద్ద ప్లేయర్లతో ధీటుగా నిలబడాలంటే పెద్ద సినిమాల హక్కులు సొంతం చేసుకోవాలని అల్లు అరవింద్ గ్రహించారు. ఈ విషయంలో ముందే మేల్కొనక పోవడం వల్ల అల వైకుంఠపురములో హక్కులు వదిలేసుకున్నారు. లాక్ డౌన్ లో భవిష్యత్తు డిజిటల్ ప్లాటుఫామ్స్ దేనని అల్లు గ్రహించారు. అందుకే క్రేజీ సినిమాల హక్కులు సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ముందుగా ఈ టైంలో ఏదైనా పెద్ద సినిమాను ఆహా ద్వారా విడుదల చేస్తే సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతారని, విడుదలకు సిద్ధంగా ఉన్న నాని సినిమా ‘వి’ హక్కులు దక్కించుకుంటే ఈ గేమ్ లో చాలా ముందుకు వెళ్లవచ్చునని భావిస్తున్నారు. డిజిటల్ రిలీజ్ కి దిల్ రాజు సుముఖంగా లేకపోయినా కానీ అల్లు అరవింద్, బన్నీ వాస్ తరచుగా దిల్ రాజుని కాంటాక్ట్ చేస్తూ టెంప్టింగ్ ఆఫర్స్ ఇస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మూడు నెలలు ఆలస్యమయిన ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలంటే కనీసం మరో మూడు నెలలు ఆగక తప్పదు. అంతవరకు రాజు ఓపిక పడతాడా లేక ఒత్తిడికి తలొగ్గి ఓటిటీ దారి పడతాడా అనేది చూడాలి.
This post was last modified on July 1, 2020 8:30 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…