ఓటిటీ గేమ్ లో పెద్ద పెద్ద ప్లేయర్లతో ధీటుగా నిలబడాలంటే పెద్ద సినిమాల హక్కులు సొంతం చేసుకోవాలని అల్లు అరవింద్ గ్రహించారు. ఈ విషయంలో ముందే మేల్కొనక పోవడం వల్ల అల వైకుంఠపురములో హక్కులు వదిలేసుకున్నారు. లాక్ డౌన్ లో భవిష్యత్తు డిజిటల్ ప్లాటుఫామ్స్ దేనని అల్లు గ్రహించారు. అందుకే క్రేజీ సినిమాల హక్కులు సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ముందుగా ఈ టైంలో ఏదైనా పెద్ద సినిమాను ఆహా ద్వారా విడుదల చేస్తే సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతారని, విడుదలకు సిద్ధంగా ఉన్న నాని సినిమా ‘వి’ హక్కులు దక్కించుకుంటే ఈ గేమ్ లో చాలా ముందుకు వెళ్లవచ్చునని భావిస్తున్నారు. డిజిటల్ రిలీజ్ కి దిల్ రాజు సుముఖంగా లేకపోయినా కానీ అల్లు అరవింద్, బన్నీ వాస్ తరచుగా దిల్ రాజుని కాంటాక్ట్ చేస్తూ టెంప్టింగ్ ఆఫర్స్ ఇస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మూడు నెలలు ఆలస్యమయిన ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలంటే కనీసం మరో మూడు నెలలు ఆగక తప్పదు. అంతవరకు రాజు ఓపిక పడతాడా లేక ఒత్తిడికి తలొగ్గి ఓటిటీ దారి పడతాడా అనేది చూడాలి.
This post was last modified on July 1, 2020 8:30 pm
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…
ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…
ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…
భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…
గుడివాడలో విజయం కోసం నాని నానాపాట్లు పడుతున్నారు. తన అనుచరుల ఆగడాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు కష్టపడుతున్నారు. కానీ…