బాలీవుడ్లో పెద్ద స్టార్ల సినిమాలు రిలీజైనపుడల్లా వాటి బాయ్కాట్ చేయమంటూ సోషల్ మీడియాలో ట్రెండ్స్ నడవడం మామూలైపోతోంది. రెండు వర్గాలు అదే పనిగా కొన్ని చిత్రాలను టార్గెట్ చేస్తుండడం గమనార్హం. అందులో హిందుత్వ మద్దతుదారులు ఒక వర్గం అయితే, సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానులు ఇంకో వర్గం. బాలీవుడ్లో ఎప్పుడూ హిందూ వ్యతిరేక సినిమాలే వస్తుంటాయన్నది ఒక వర్గం కంప్లైంట్ అయితే.. కొందరు స్టార్లు, అలాగే నెపో కిడ్స్ కారణంగానే సుశాంత్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడంటూ ఇంకో వర్గం ఆరోపణ.
ఈ నేపథ్యంలో హిందీలో ఈ రెండు వర్గాలకు నచ్చని హీరోల సినిమాలు రిలీజైనపుడల్లా నెగెటివ్ ట్రెండ్స్కు దిగుతున్నారు. తాజాగా అలా వారి టార్గెట్గా మారిన సినిమా.. షంషేరా. బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన రణబీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
సుశాంత్ సింగ్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించే హీరోల్లో రణబీర్ ఒకడు. పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న ఇలాంటి వాళ్లు సుశాంత్ను తొక్కేసి అతడి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని వాళ్లు ఆరోపిస్తుంటారు. ఇక రణబీర్ గతంలో హిందూ వ్యతిరేక కామెంట్లు చేశారంటూ ఇంకో వర్గం అతడిని టార్గెట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి #BoycottShamshera అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. సినిమా శుక్రవారం రిలీజవుతుండగా.. ముందు రోజు ఈ హ్యాష్ ట్యాగ్ ఇండియా లెవెల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది.
రణబీర్ గతంలో తాను ధోతీ ధరించే సినిమా ఏదీ చేయబోనంటూ కామెంట్ చేయడాన్ని హిందూ మద్దతుదారులు తప్పుబడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి కంప్లైంట్లు మరికొన్ని ఉన్నాయి వారి నుంచి. ఇక సుశాంత్ అభిమానులైతే ఇంకా తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అసలే హిందీ చిత్రాల పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటే.. ఇలాంటి నెగెటివ్ ట్రెండ్స్తో మరింత డ్యామేజ్ జరుగుతోందన్నది వాస్తవం.
This post was last modified on July 22, 2022 9:01 am
ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…