మాములుగా వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా సినిమా వస్తోందంటే దాని హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ప్రమోషన్లు పీక్స్ లో ఉంటాయి. హీరో దర్శకుడు బయటికి వచ్చి అడిగిన మీడియాకల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ హైప్ ని పెంచే ప్రయత్నం చేస్తారు. అది ఆర్ఆర్ఆర్ కావొచ్చు లేదా లైగర్ అవ్వొచ్చు. ఏదైనా సరే పబ్లిసిటీ ముఖ్యం బిగిలూ తరహాలో ప్రచారానికి దిగాల్సిందే. కానీ విచిత్రంగా తమిళంలో తీసి అన్ని ప్రధాన భాషల్లో ఈ నెల 28న రాబోతున్న ది లెజెండ్ కేసు మాత్రం చాలా వెరైటీగా ఉంది.
వేల కోట్ల వ్యాపారాలతో బిజినెస్ టైకూన్ గా పేరున్న శరవణన్ హీరోగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఆల్రెడీ మీమ్స్ చేసే వాళ్లకు మంచి స్టఫ్ మెటీరియల్ గా మారిపోయింది. ఒక్కొక్కటిగా వీడియో సాంగ్స్ బయటికి వస్తున్నాయి. కలర్ఫుల్ సెట్లు, ప్రొడక్షన్ లో గ్రాండియర్ చూసి జనాలు ఆమ్మో అనుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ సినిమాలో చూపించింది అసలు హీరోనేనా లేక ముఖం, శరీరం గట్రా గ్రాఫిక్స్ లో తయారు చేయించారానే అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగానే విజువల్స్ చూస్తే ఆ డౌట్ రావడం ఖాయం.
విచిత్రంగా శరవణన్ ఎక్కువగా బయటికి రావడం లేదు. ముఖ్యంగా తెలుగు కన్నడ మలయాళంలో ఇప్పటిదాకా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఈవెంట్లు చేయలేదు. చెన్నైలో ఒకటి చేశారు కానీ వ్యక్తిగతంగా ఫోజులు ఇవ్వడానికి శరవణన్ ఇష్టపడలేదు. కెమెరామెన్లు దూరం నుంచే తీసుకుని సర్దుకున్నారు. మాములుగా శరవణన్ ది అంత తెల్లగా ఉండే ఛాయ కాదు. కానీ సినిమాలో మాత్రం మహేష్ బాబు రేంజ్ లో మెరిసిపోతున్నాడు. ఈ రహస్యం ఏమిటో బయటి ప్రపంచానికి చెబితే బాగుంటుంది. కానీ అసలు ఆ ఒరిజినల్ హీరో బయటికి వస్తేగా.
This post was last modified on July 21, 2022 7:21 pm
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…
ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…
కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే.…
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…