ఇటీవలే విడుదలైన విక్రమ్ రూపంలో లోకనాయకుడు కమల్ హాసన్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాక ఆయన అప్పులన్నీ తీరేందుకు కారణమైన దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి బాలీవుడ్ లోనూ చర్చలు జరుగుతున్నాయి. అక్కడి తలలు పండిన స్టార్లు సైతం ఒకవేళ ఇతను ఒప్పుకుంటే ఎంత రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా రెడీగా ఉన్నారు. కానీ లోకేష్ మాత్రం ఓన్లీ సౌత్ సూత్రంతో ఇక్కడి వాళ్ళతోనే చేసేందుకు కట్టుబడ్డాడు. ఈ క్రమంలోనే ఆ మధ్య రామ్ చరణ్ తో తను చేసే అవకాశాల గురించి గట్టి ప్రచారం జరిగింది.
అది నిజమా కాదా అనే అయోమయం ఫ్యాన్స్ లోనూ నెలకొంది. దానికి లోకేష్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఆ ప్రాజెక్టు మీద స్పష్టంగా ఓపెన్ అయ్యాడు. దాని ప్రకారం లోకేష్ కనగరాజ్ చరణ్ ను హైదరాబాద్ లో కలిశాడు. ఇద్దరి మధ్య మీటింగ్ జరిగింది. మెగా పవర్ స్టార్ ఆతిథ్యం, వ్యక్తిత్వం గురించి అంతగా అవగాహన లేని లోకేష్ తనను రిసీవ్ చేసుకున్న తీరు చూసి షాక్ అయ్యాడు. అంత పెద్ద హీరో అయ్యుండి ఇంత సింపుల్ గా ఉండటం షాక్ కు గురి చేసింది. అలా ఒక దఫా మీటయ్యారు
ప్రస్తుతం లోకేష్ చేతిలో రెండు మూడు కమిట్ మెంట్లు ఉన్నాయి. ముందు విజయ్ ది పూర్తి చేయాలి. ఆ తర్వాత ఖైదీ 2 ఉంటుంది. అదయ్యాక విక్రమ్ సీక్వెల్ లో కమల్, సూర్య, కార్తీలను కలిపి ఒక మల్టీవర్స్ మూవీ ఇవ్వాలి. ఇటు చరణ్ ని చూస్తే శంకర్ ప్యాన్ ఇండియా సినిమా చేశాక గౌతమ్ తిన్ననూరితో జాయినవ్వాలి. ఎంత లేదన్నా 2024 వచ్చేస్తుంది. అలా వీళ్ళిద్దరూ ఇవి ఫినిష్ చేసుకున్నాక అప్పుడు చేతులు కలుపుతారు. తమ కాంబినేషన్ ది బిగ్గెస్ట్ ఉంటుందని లోకేష్ నొక్కి చెప్పడం చూస్తే ఫ్యాన్స్ గాల్లో తేలడం ఖాయం.
This post was last modified on July 21, 2022 7:08 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…