త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్నేళ్లుగా హారిక హాసిని సంస్థకు కట్టుబడి, తన సినిమాలన్నీ వాళ్ళకే చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తో సినిమా అంటే హారిక హాసినికే చేయాల్సి వస్తోందని హీరోలు కొత్త పద్ధతి కనిపెట్టారు.
త్రివిక్రమ్ తో చేసే సినిమాకు తమ సొంత సంస్థకు కూడా వాటా కావాలని లింక్ పెడుతున్నారు. అల వైకుంఠపురములో తర్వాత ఎన్టీఆర్ 30వ చిత్రానికి కూడా అదే ఫాలో అవుతున్నారు.
త్రివిక్రమ్ ఈ సంస్థకు స్క్రిప్ట్ సలహాలు, ఎడిటింగ్ లో సూచనలు కూడా ఇస్తుంటాడు. ఒక రకంగా ఆ సంస్థలో అన్నీ ఆయనే. మైత్రి మూవీ మేకర్స్ కూడా అలా కొరటాల శివను పెద్ద దిక్కుగా పెట్టుకున్నారు.
మొన్నామధ్య వరుస పరాజయాలు రావడంతో కొరటాల శివ సలహా సంప్రదింపులు లేకుండా ఏ సినిమా మొదలు పెట్టకూడదని డిసైడ్ అయ్యారు. సర్కారు వారి పాట కథ విని ఆ కథను మహేష్ కి సిఫార్సు చేసింది కూడా కొరటాల శివేనట. ఆచార్య ముగిసిన తర్వాత ఈ సంస్థకే కొరటాల మలి చిత్రం చేస్తాడని టాక్.
This post was last modified on July 10, 2020 8:45 am
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…
గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…
గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…
ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ…
జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…