త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్నేళ్లుగా హారిక హాసిని సంస్థకు కట్టుబడి, తన సినిమాలన్నీ వాళ్ళకే చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తో సినిమా అంటే హారిక హాసినికే చేయాల్సి వస్తోందని హీరోలు కొత్త పద్ధతి కనిపెట్టారు.
త్రివిక్రమ్ తో చేసే సినిమాకు తమ సొంత సంస్థకు కూడా వాటా కావాలని లింక్ పెడుతున్నారు. అల వైకుంఠపురములో తర్వాత ఎన్టీఆర్ 30వ చిత్రానికి కూడా అదే ఫాలో అవుతున్నారు.
త్రివిక్రమ్ ఈ సంస్థకు స్క్రిప్ట్ సలహాలు, ఎడిటింగ్ లో సూచనలు కూడా ఇస్తుంటాడు. ఒక రకంగా ఆ సంస్థలో అన్నీ ఆయనే. మైత్రి మూవీ మేకర్స్ కూడా అలా కొరటాల శివను పెద్ద దిక్కుగా పెట్టుకున్నారు.
మొన్నామధ్య వరుస పరాజయాలు రావడంతో కొరటాల శివ సలహా సంప్రదింపులు లేకుండా ఏ సినిమా మొదలు పెట్టకూడదని డిసైడ్ అయ్యారు. సర్కారు వారి పాట కథ విని ఆ కథను మహేష్ కి సిఫార్సు చేసింది కూడా కొరటాల శివేనట. ఆచార్య ముగిసిన తర్వాత ఈ సంస్థకే కొరటాల మలి చిత్రం చేస్తాడని టాక్.
This post was last modified on July 10, 2020 8:45 am
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…