విక్రమ్ ప్రభు డైరెక్షన్ లో నాగ చైతన్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటివలే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ విషయం బయటపెట్టాడు చైతు. సినిమాలో నేను పోలీస్ కేరెక్టర్ చేస్తున్నాను అంటూ ఇది పోలీస్ కథతో తెరకెక్కుతున్న యాక్షన్ సినిమా అని చెప్పేశాడు. దీంతో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ లో భయం మొదలైంది. దీనికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఈ మధ్యే రామ్ తమిళ దర్శకుడితో ‘వారియర్’ అంటూ ఓ పోలీస్ కథతో యాక్షన్ సినిమా చేశాడు. ఆ సినిమా రిజల్ట్ ఏమైందో తెలిసిందే. అందుకే తమిళ దర్శకుడితో పోలీస్ గా చైతు సినిమా అంటే ఇప్పుడు వారిలో టెన్షన్ స్టార్టయింది.
నిజానికి కాప్ యాక్షన్ డ్రామాలకు కాలం చెల్లింది. కంటెంట్ ఎక్స్ట్రార్డినరి గా ఉంటే తప్ప వర్కౌట్ అవ్వదు. కేజీఎఫ్ 2, విక్రమ్ వంటి అల్టిమేట్ యాక్షన్ సినిమాలు చూసిన కళ్ళకు ఇప్పుడు రెగ్యులర్ రొటీన్ యాక్షన్ సినిమాలు ఆనవు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇంకో విషయం ఏమిటంటే వారియర్ కి , ఇప్పుడు చైతు సినిమాకి రెండు చిత్రాలకు కోలీవుడ్ దర్శకులు కావడం. పైగా రెండు సినిమాల్లో కృతి శెట్టినే హీరోయిన్ కూడా… పోలీస్ కథ , తమిళ దర్శకుడు , సేమ్ హీరోయిన్ ఈ కంపెరిజన్స్ అక్కినేని ఫ్యాన్స్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి.
ప్రస్తుతం చైతూ సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఈ టైంలో రొటీన్ యాక్షన్ సినిమాతో దెబ్బ తింటే కెరీర్ డౌన్ అవుతుంది. వెంకట్ ప్రభు మంచి దర్శకుడే కానీ ఆయనతో ఏదైనా రీమేక్ సినిమా కాకుండా ఇలా యాక్షన్ సినిమా చేయడం అంటే చైతు రిస్క్ చేస్తున్నట్లే. మరి వారియర్ రిజల్ట్ తన బైలింగ్వెల్ సినిమాకు రిపీట్ అవ్వకుండా చైతూ కాస్త జాగ్రత్త తీసుకుంటే బెటర్.
This post was last modified on July 20, 2022 9:58 pm
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…