విక్రమ్ ప్రభు డైరెక్షన్ లో నాగ చైతన్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటివలే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ విషయం బయటపెట్టాడు చైతు. సినిమాలో నేను పోలీస్ కేరెక్టర్ చేస్తున్నాను అంటూ ఇది పోలీస్ కథతో తెరకెక్కుతున్న యాక్షన్ సినిమా అని చెప్పేశాడు. దీంతో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ లో భయం మొదలైంది. దీనికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఈ మధ్యే రామ్ తమిళ దర్శకుడితో ‘వారియర్’ అంటూ ఓ పోలీస్ కథతో యాక్షన్ సినిమా చేశాడు. ఆ సినిమా రిజల్ట్ ఏమైందో తెలిసిందే. అందుకే తమిళ దర్శకుడితో పోలీస్ గా చైతు సినిమా అంటే ఇప్పుడు వారిలో టెన్షన్ స్టార్టయింది.
నిజానికి కాప్ యాక్షన్ డ్రామాలకు కాలం చెల్లింది. కంటెంట్ ఎక్స్ట్రార్డినరి గా ఉంటే తప్ప వర్కౌట్ అవ్వదు. కేజీఎఫ్ 2, విక్రమ్ వంటి అల్టిమేట్ యాక్షన్ సినిమాలు చూసిన కళ్ళకు ఇప్పుడు రెగ్యులర్ రొటీన్ యాక్షన్ సినిమాలు ఆనవు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇంకో విషయం ఏమిటంటే వారియర్ కి , ఇప్పుడు చైతు సినిమాకి రెండు చిత్రాలకు కోలీవుడ్ దర్శకులు కావడం. పైగా రెండు సినిమాల్లో కృతి శెట్టినే హీరోయిన్ కూడా… పోలీస్ కథ , తమిళ దర్శకుడు , సేమ్ హీరోయిన్ ఈ కంపెరిజన్స్ అక్కినేని ఫ్యాన్స్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి.
ప్రస్తుతం చైతూ సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఈ టైంలో రొటీన్ యాక్షన్ సినిమాతో దెబ్బ తింటే కెరీర్ డౌన్ అవుతుంది. వెంకట్ ప్రభు మంచి దర్శకుడే కానీ ఆయనతో ఏదైనా రీమేక్ సినిమా కాకుండా ఇలా యాక్షన్ సినిమా చేయడం అంటే చైతు రిస్క్ చేస్తున్నట్లే. మరి వారియర్ రిజల్ట్ తన బైలింగ్వెల్ సినిమాకు రిపీట్ అవ్వకుండా చైతూ కాస్త జాగ్రత్త తీసుకుంటే బెటర్.
This post was last modified on July 20, 2022 9:58 pm
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…