తెలుగు, తమిళ భాషల్లో ఒక దశాబ్దం పాటు టాప్ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. అడపా దడపా ఆమె హిందీలో కూడా పెద్ద సినిమాలే చేసింది కానీ.. అవేవీ ఆమెకు ఆశించిన ఫలితాలివ్వలేదు. గత కొన్నేళ్లలో దక్షిణాదిన కూడా ఆమె హవా తగ్గిపోయింది. తన రేంజ్ బాగా తగ్గించుకుని చిన్న-మీడియం స్థాయి సినిమాలు చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. అలా అని ఆమె సినిమాలైతే ఆపేయలేదు. బహు భాషల్లో ఆమె సినిమాలు చేస్తూనే ఉంది.
తాజాగా తమన్నా హిందీలో ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరైన సీనియర్ దర్శకుడు మాధుర్ బండార్కర్ రూపొందించిన చిత్రమిది. కరోనాకు ముందే అనౌన్స్ అయిన ఈ చిత్రం మేకింగ్ ఆలస్యమై.. రిలీజ్ కూడా లేటైంది. ఎట్టకేలకు ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాకపోతే థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో ఈ చిత్రాన్ని దించేస్తున్నారు.
‘బబ్లీ బౌన్సర్’ను హాట్ స్టార్ ఓటీటీలో సెప్టెంబరు 23న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మధ్య హిందీ చిత్రాలకు థియేటర్లలో ఎదురవుతున్న పరాభవాల గురించి తెలిసిందే. పేరున్న హీరోలు నటించిన సినిమాలు కూడా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, షాహిద్ కపూర్ లాంటి స్టార్లు నటించిన సినిమాలు టాక్తో సంబంధం లేకుండా బోల్తా కొట్టాయి. ముఖ్యంగా క్లాస్ టచ్ ఉన్న సినిమాలకు అస్సలు ఓపెనింగ్స్ రావట్లేదు.
ఇలాంటి టైంలో తమన్నా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసే సాహసం చేయలేకపోయినట్లున్నాడు మాధుర్ బండార్కర్. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎక్కువ రేటు కూడా వస్తుంది కాబట్టి ఆ మార్గాన్నే ఎంచుకున్నట్లున్నాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా మాధురే కావడం విశేషం. హిందీతో పాటు తమన్నాకు మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళం, తెలుగు భాషల్లోనూ ‘బబ్లీ బౌన్సర్’ రిలీజ్ కాబోతోంది. మరి ఒకప్పుడు క్లాసిక్స్ తీసిన మాధుర్.. తమన్నాతో ఎలాంటి సినిమా అందించాడో చూడాలి.
This post was last modified on July 20, 2022 9:52 pm
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…
2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…