పుష్పలో ఐటెం సాంగ్ చేశాక మరింత బిజీ అయిపోయిన సమంతాకు ఆఫర్లు మాత్రం ఆగడం లేదు. ఒకపక్క సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఇండిపెడెంట్ ఫిలింస్, టాక్ షోలు, ఇంటర్వ్యూలు ఇలా అన్ని రకాలుగా బిజీగా మారిపోయింది. త్వరలో తమిళంలో రూపొందబోయే విజయ్ సినిమాలో తనే హీరోయిననే ప్రచారం చెన్నై మీడియాలో జోరుగా సాగింది. విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో స్కై హైలో ఉన్న లోకేష్ కనగరాజ్ దీనికి దర్శకుడు. ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు కానీ వారసుడు పూర్తయ్యేలోపు లోకేష్ స్క్రిప్ట్ ఫైనల్ చేసేయాలి.
ఇక్కడే ఓ ట్విస్టు ఉంది. అందరూ అనుకున్నట్టు సామ్ ఇందులో హీరోయిన్ కాదట. నెగటివ్ షేడ్స్ లో సాగే పోలీస్ ఆఫీసర్ గా చాలా కొత్తగా కనిపించనుందట. పాత్ర తీరుతెన్నులు చెప్పగానే సమంతా ఆల్మోస్ట్ ఓకే చేసినట్టు సమాచారం. ఫ్యామిలీ మ్యాన్ 2లో ఆల్రెడీ చేసిన అనుభవం ఉంది. అందులో ఆడియన్స్ తనను బాగా రిసీవ్ చేసుకున్నారు. సో విలన్ టచ్ ఉన్న క్యారెక్టర్ కొత్తేమి కాదు. అయితే నరసింహలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి అంత వెయిటేజ్ ఉంటేనే ఇలాంటివి కెరీర్ పరంగా ఉపయోగపడతాయి.
విజయ్ తో గతంలో సామ్ మూడుసార్లు జోడిగా నటించింది. కత్తి, పోలీసోడు, అదిరింది మూడు తమిళంలో ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్లు. తెలుగులోనూ ఓ మాదిరిగా ఆడాయి. యశోద, శాకుంతలం లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ తో పాటు ఖుషి లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఒకేసారి చేస్తున్న సమంతా ఖాకీ డ్రెస్సులో విలనిజం చూపించడం రిస్క్ తో కూడిన వెరైటీ అవుతుంది. కాఫీ విత్ కరణ్ ఓటిటి టాక్ షోలో మెరవనున్న సామ్ కు రాబోయే ఆరు నెలల్లో కనీసం మూడు నాలుగు రిలీజులు ఉండబోతున్నాయి.
This post was last modified on July 20, 2022 7:03 pm
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…