విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లైగర్ ప్రమోషన్లను మెల్లగా పీక్స్ కు తీసుకెళ్తున్నారు. రేపు జరగబోయే ట్రైలర్ లాంచ్ ని ఆర్టిసి క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35 ఎంఎంలో గ్రాండ్ గా చేయబోతున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన పెద్ద కటవుట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒంటి మీద అండర్ వేర్ తో భుజాల వెనుక జాతీయ జెండాను పట్టుకుని సిక్స్ ప్యాక్ తో రౌడీ బాయ్ ఇచ్చిన స్టిల్ లేడీ అభిమానులకు మాత్రం యమా హాట్ గా ఉంది.
ఇదంతా ఓకే కానీ ఇలా ఎక్కువ శాతం పబ్లిసిటీలో విజయ్ దేవరకొండను తక్కువ దుస్తులతో చూపించడం ఏంటో అర్థం కావడం లేదు. క్యారెక్టర్ బాక్సరే కావొచ్చు. రింగ్ లోకి వెళ్ళినప్పుడు ఒంటి మీద అంగరక్షం తప్ప వేరే బట్టలు ఉండవు. అదీ సహజమే. అంత మాత్రాన అన్నిటికి ఇలా చూపించుకుంటూ పోవాలానే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆ మధ్య వదిలిన ఓ పోస్టర్ లో పూల గుత్తిని అడ్డుగా పెట్టుకుని నగ్నంగా నిలుచుకోవడం మీద విమర్శలు వచ్చిన మాట తెలిసిందే. దాన్ని సమర్ధించుకున్నారు లెండి
లైగర్ మీద మాములు అంచనాలు లేవు. థియేటర్ల దగ్గర మాస్ జాతర తీసుకొస్తుందని ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది. దానికి తగ్గట్టు కంటెంట్ వైరల్ అవ్వాలంటే ఇలాంటి ప్రచారమే కరెక్టనే వాదనలు లేకపోలేదు. ముందు నుంచి ఇదే తరహా స్ట్రాటజీని ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ టీమ్ కు ఇప్పుడు పూరి బృందం తోడవ్వడంతో దాన్ని ఇంకో లెవెల్ కు తీసుకెళ్తున్నారు. రేపు భాగ్యనగరంతో పాటు ముంబైలోనూ ఈవెంట్ చేయబోతున్నారు. ఎయిర్ పోర్ట్ కు వచ్చి కవరేజ్ ఇవ్వమని మీడియాకు కబురంపడం ఫైనల్ ట్విస్ట్
This post was last modified on July 20, 2022 2:23 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…