విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లైగర్ ప్రమోషన్లను మెల్లగా పీక్స్ కు తీసుకెళ్తున్నారు. రేపు జరగబోయే ట్రైలర్ లాంచ్ ని ఆర్టిసి క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35 ఎంఎంలో గ్రాండ్ గా చేయబోతున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన పెద్ద కటవుట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒంటి మీద అండర్ వేర్ తో భుజాల వెనుక జాతీయ జెండాను పట్టుకుని సిక్స్ ప్యాక్ తో రౌడీ బాయ్ ఇచ్చిన స్టిల్ లేడీ అభిమానులకు మాత్రం యమా హాట్ గా ఉంది.
ఇదంతా ఓకే కానీ ఇలా ఎక్కువ శాతం పబ్లిసిటీలో విజయ్ దేవరకొండను తక్కువ దుస్తులతో చూపించడం ఏంటో అర్థం కావడం లేదు. క్యారెక్టర్ బాక్సరే కావొచ్చు. రింగ్ లోకి వెళ్ళినప్పుడు ఒంటి మీద అంగరక్షం తప్ప వేరే బట్టలు ఉండవు. అదీ సహజమే. అంత మాత్రాన అన్నిటికి ఇలా చూపించుకుంటూ పోవాలానే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆ మధ్య వదిలిన ఓ పోస్టర్ లో పూల గుత్తిని అడ్డుగా పెట్టుకుని నగ్నంగా నిలుచుకోవడం మీద విమర్శలు వచ్చిన మాట తెలిసిందే. దాన్ని సమర్ధించుకున్నారు లెండి
లైగర్ మీద మాములు అంచనాలు లేవు. థియేటర్ల దగ్గర మాస్ జాతర తీసుకొస్తుందని ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది. దానికి తగ్గట్టు కంటెంట్ వైరల్ అవ్వాలంటే ఇలాంటి ప్రచారమే కరెక్టనే వాదనలు లేకపోలేదు. ముందు నుంచి ఇదే తరహా స్ట్రాటజీని ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ టీమ్ కు ఇప్పుడు పూరి బృందం తోడవ్వడంతో దాన్ని ఇంకో లెవెల్ కు తీసుకెళ్తున్నారు. రేపు భాగ్యనగరంతో పాటు ముంబైలోనూ ఈవెంట్ చేయబోతున్నారు. ఎయిర్ పోర్ట్ కు వచ్చి కవరేజ్ ఇవ్వమని మీడియాకు కబురంపడం ఫైనల్ ట్విస్ట్
This post was last modified on July 20, 2022 2:23 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…