కోలీవుడ్ లో శింబుతో వెంకట్ ప్రభు తీసిన ‘మానాడు’ పెద్ద హిట్టయింది. వెంటనే తెలుగు రీమేక్ రైట్స్ కోసం నిర్మాతలు పోటీ పడ్డారు. ఫైనల్ గా నిర్మాత సురేష్ బాబు రైట్స్ దక్కించుకున్నారు. సురేష్ ప్రొడక్షన్ లో చైతన్య హీరోగా చేయాలనుకున్నారు. కానీ ఎందుకో కుదరలేదు. దీంతో వెంకట్ ప్రభు చైతు కోసం ఇంకో కథ రాసి తెలుగులో సినిమా చేస్తున్నాడు.
ఆ తర్వాత ‘మానాడు’ రీమేక్ గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. తాజాగా నాగ చైతన్య ని మీడియా ఆ రీమేక్ గురించి అడగ్గా అసలు మేటర్ రివీల్ చేసేసాడు చైతు. ఆ సినిమా చూశాను నాకు బాగా నచ్చింది. మానాడు కంటే ముందే నేను, విక్రమ్ ప్రభు సినిమా కోసం ట్రావెల్ అవుతున్నాం. ఆ రీమేక్ చేయాలనుకున్నాను. కానీ సెట్ అవ్వలేదు. ఇప్పుడు రానా ఆ సినిమా చేస్తున్నాడు. దర్శకుడు ఫైనల్ అవ్వలేదు అంటూ అసలు విషయం చెప్పేశాడు చైతు.
అలాగే నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి కూడా తెలిపాడు. పరశురాం నేను ఈ మధ్యే వారం క్రితం కలిసాం. కథతో మళ్లీ కలుస్తానన్నాడు. ఇంకా కథ ఫైనల్ అవ్వలేదు ఐడియా మాత్రమే చెప్పాడు. అలాగే తరుణ్ భాస్కర్ తో కూడా సినిమా చేయాల్సి ఉంది ఆ ప్రాజెక్ట్ ఇంకా డిస్కషన్ లోనే ఉంది అంటూ క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on July 19, 2022 4:20 pm
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…