కోలీవుడ్ లో శింబుతో వెంకట్ ప్రభు తీసిన ‘మానాడు’ పెద్ద హిట్టయింది. వెంటనే తెలుగు రీమేక్ రైట్స్ కోసం నిర్మాతలు పోటీ పడ్డారు. ఫైనల్ గా నిర్మాత సురేష్ బాబు రైట్స్ దక్కించుకున్నారు. సురేష్ ప్రొడక్షన్ లో చైతన్య హీరోగా చేయాలనుకున్నారు. కానీ ఎందుకో కుదరలేదు. దీంతో వెంకట్ ప్రభు చైతు కోసం ఇంకో కథ రాసి తెలుగులో సినిమా చేస్తున్నాడు.
ఆ తర్వాత ‘మానాడు’ రీమేక్ గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. తాజాగా నాగ చైతన్య ని మీడియా ఆ రీమేక్ గురించి అడగ్గా అసలు మేటర్ రివీల్ చేసేసాడు చైతు. ఆ సినిమా చూశాను నాకు బాగా నచ్చింది. మానాడు కంటే ముందే నేను, విక్రమ్ ప్రభు సినిమా కోసం ట్రావెల్ అవుతున్నాం. ఆ రీమేక్ చేయాలనుకున్నాను. కానీ సెట్ అవ్వలేదు. ఇప్పుడు రానా ఆ సినిమా చేస్తున్నాడు. దర్శకుడు ఫైనల్ అవ్వలేదు అంటూ అసలు విషయం చెప్పేశాడు చైతు.
అలాగే నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి కూడా తెలిపాడు. పరశురాం నేను ఈ మధ్యే వారం క్రితం కలిసాం. కథతో మళ్లీ కలుస్తానన్నాడు. ఇంకా కథ ఫైనల్ అవ్వలేదు ఐడియా మాత్రమే చెప్పాడు. అలాగే తరుణ్ భాస్కర్ తో కూడా సినిమా చేయాల్సి ఉంది ఆ ప్రాజెక్ట్ ఇంకా డిస్కషన్ లోనే ఉంది అంటూ క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on July 19, 2022 4:20 pm
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…