కోలీవుడ్ లో శింబుతో వెంకట్ ప్రభు తీసిన ‘మానాడు’ పెద్ద హిట్టయింది. వెంటనే తెలుగు రీమేక్ రైట్స్ కోసం నిర్మాతలు పోటీ పడ్డారు. ఫైనల్ గా నిర్మాత సురేష్ బాబు రైట్స్ దక్కించుకున్నారు. సురేష్ ప్రొడక్షన్ లో చైతన్య హీరోగా చేయాలనుకున్నారు. కానీ ఎందుకో కుదరలేదు. దీంతో వెంకట్ ప్రభు చైతు కోసం ఇంకో కథ రాసి తెలుగులో సినిమా చేస్తున్నాడు.
ఆ తర్వాత ‘మానాడు’ రీమేక్ గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. తాజాగా నాగ చైతన్య ని మీడియా ఆ రీమేక్ గురించి అడగ్గా అసలు మేటర్ రివీల్ చేసేసాడు చైతు. ఆ సినిమా చూశాను నాకు బాగా నచ్చింది. మానాడు కంటే ముందే నేను, విక్రమ్ ప్రభు సినిమా కోసం ట్రావెల్ అవుతున్నాం. ఆ రీమేక్ చేయాలనుకున్నాను. కానీ సెట్ అవ్వలేదు. ఇప్పుడు రానా ఆ సినిమా చేస్తున్నాడు. దర్శకుడు ఫైనల్ అవ్వలేదు అంటూ అసలు విషయం చెప్పేశాడు చైతు.
అలాగే నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి కూడా తెలిపాడు. పరశురాం నేను ఈ మధ్యే వారం క్రితం కలిసాం. కథతో మళ్లీ కలుస్తానన్నాడు. ఇంకా కథ ఫైనల్ అవ్వలేదు ఐడియా మాత్రమే చెప్పాడు. అలాగే తరుణ్ భాస్కర్ తో కూడా సినిమా చేయాల్సి ఉంది ఆ ప్రాజెక్ట్ ఇంకా డిస్కషన్ లోనే ఉంది అంటూ క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on July 19, 2022 4:20 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…