టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడు దిల్ రాజు. సినిమాల స్కేల్, లాంగివిటీ, సక్సెస్ రేట్.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూస్తే ఆయన్ని తెలుగులో నంబర్ వన్ ప్రొడ్యూసర్ అని కూడా చెప్పొచ్చు. ఐతే దీని వెనుక ఎంత కష్టముందో అందరికీ తెలుసు. ఐతే టాలీవుడ్లో జెండా ఎగరేస్తే సరిపోదని పాన్ ఇండియా స్థాయికి తన ప్రస్థానాన్ని విస్తరించాలని ఆయన కొన్నేళ్ల నుంచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే హిందీలో సినిమాల నిర్మాణం మొదలుపెట్టారు. అలాగే పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నారు.
ఐతే తెలుగులో బాగా ఆడిన సినిమాలను ఎంచుకుని హిందీలో పునర్నిర్మించి మంచి ఫలితాలు అందుకోవాలని ప్లాన్ చేసిన ఆయనకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ‘జెర్సీ’ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేయగా.. అది తుస్సుమనిపించింది. తాజాగా ‘హిట్’ రీమేక్తో హిందీ ప్రేక్షకులను పలకరిస్తే అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినట్లే కనిపిస్తోంది. వీకెండ్లో ఈ చిత్రం రూ.5 కోట్ల వసూళ్లకు పరిమితం కావడం పెద్ద షాకే.
తెలుగులో తన కొత్త చిత్రం ‘థ్యాంక్ యు’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసి రాజుకు తన బాలీవుడ్ డిజాస్టర్ల గురించి అడిగిన ప్రశ్నకు నిజాయితీగా సమాధానం ఇచ్చాడు. షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్’ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత చేసిన సినిమా ‘జెర్సీ’ అని.. ఈ చిత్రం తమ అందరికీ జాక్ పాట్ అవుతుందని.. 30-40 కోట్ల లాభం తెచ్చి పెడుతుందని అంచనా వేశామని.. కొవిడ్కు ముందున్న వాతావరణంలో అయితే సినిమా తమ అంచనాలకు తగ్గట్లే పెర్ఫామ్ చేసేదని.. కానీ కరోనా తర్వాత క్లాస్ సినిమాలు థియేటర్లలో ఆడే పరిస్థితి లేదని.. మొత్తంగా అక్కడ థియేటర్ రెవెన్యూ బాగా పడిపోయిందని.. పలుమార్లు వాయిదా పడి ఆలస్యంగా రిలీజైన‘జెర్సీ’కి లాభాలు అందుకోవడం సంగతటుంచితే 4-5 కోట్ల నష్టం భరించాల్సిన పరిస్థితి తలెత్తిందని రాజు చెప్పాడు.
ఇక ‘హిట్’ రీమేక్ గురించి మాట్లాడుతూ.. కొవిడ్కు ముందు రాజ్ కుమార్ రావు సినిమాలకు తొలి వీకెండ్లో 15 కోట్ల దాకా వసూళ్లు వచ్చేవని.. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి అందులో మూడో వంతు మాత్రమే కలెక్షన్ వచ్చిందని.. అంతలా మార్కెట్ పరిస్థితులు మారిపోయాయని.. ఈ ఫలితం తాము ఊహించిందే అని రాజు చెప్పాడు.
This post was last modified on July 19, 2022 11:33 am
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…