టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడు దిల్ రాజు. సినిమాల స్కేల్, లాంగివిటీ, సక్సెస్ రేట్.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూస్తే ఆయన్ని తెలుగులో నంబర్ వన్ ప్రొడ్యూసర్ అని కూడా చెప్పొచ్చు. ఐతే దీని వెనుక ఎంత కష్టముందో అందరికీ తెలుసు. ఐతే టాలీవుడ్లో జెండా ఎగరేస్తే సరిపోదని పాన్ ఇండియా స్థాయికి తన ప్రస్థానాన్ని విస్తరించాలని ఆయన కొన్నేళ్ల నుంచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే హిందీలో సినిమాల నిర్మాణం మొదలుపెట్టారు. అలాగే పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నారు.
ఐతే తెలుగులో బాగా ఆడిన సినిమాలను ఎంచుకుని హిందీలో పునర్నిర్మించి మంచి ఫలితాలు అందుకోవాలని ప్లాన్ చేసిన ఆయనకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ‘జెర్సీ’ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేయగా.. అది తుస్సుమనిపించింది. తాజాగా ‘హిట్’ రీమేక్తో హిందీ ప్రేక్షకులను పలకరిస్తే అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినట్లే కనిపిస్తోంది. వీకెండ్లో ఈ చిత్రం రూ.5 కోట్ల వసూళ్లకు పరిమితం కావడం పెద్ద షాకే.
తెలుగులో తన కొత్త చిత్రం ‘థ్యాంక్ యు’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసి రాజుకు తన బాలీవుడ్ డిజాస్టర్ల గురించి అడిగిన ప్రశ్నకు నిజాయితీగా సమాధానం ఇచ్చాడు. షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్’ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత చేసిన సినిమా ‘జెర్సీ’ అని.. ఈ చిత్రం తమ అందరికీ జాక్ పాట్ అవుతుందని.. 30-40 కోట్ల లాభం తెచ్చి పెడుతుందని అంచనా వేశామని.. కొవిడ్కు ముందున్న వాతావరణంలో అయితే సినిమా తమ అంచనాలకు తగ్గట్లే పెర్ఫామ్ చేసేదని.. కానీ కరోనా తర్వాత క్లాస్ సినిమాలు థియేటర్లలో ఆడే పరిస్థితి లేదని.. మొత్తంగా అక్కడ థియేటర్ రెవెన్యూ బాగా పడిపోయిందని.. పలుమార్లు వాయిదా పడి ఆలస్యంగా రిలీజైన‘జెర్సీ’కి లాభాలు అందుకోవడం సంగతటుంచితే 4-5 కోట్ల నష్టం భరించాల్సిన పరిస్థితి తలెత్తిందని రాజు చెప్పాడు.
ఇక ‘హిట్’ రీమేక్ గురించి మాట్లాడుతూ.. కొవిడ్కు ముందు రాజ్ కుమార్ రావు సినిమాలకు తొలి వీకెండ్లో 15 కోట్ల దాకా వసూళ్లు వచ్చేవని.. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి అందులో మూడో వంతు మాత్రమే కలెక్షన్ వచ్చిందని.. అంతలా మార్కెట్ పరిస్థితులు మారిపోయాయని.. ఈ ఫలితం తాము ఊహించిందే అని రాజు చెప్పాడు.
This post was last modified on July 19, 2022 11:33 am
ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…
ప్రస్తుతం ఐటీ రాజధానిగా భాసిల్లుతున్న విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. తాజాగా విశాఖపట్నానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులకు చంద్రబాబు నేతృత్వంలోని…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…
ఐపీఎల్లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…