ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు కానీ దానికి తాలూకు అప్ డేట్స్ మాత్రం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. అందులో మొదటిది శ్రద్ధ కపూర్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట. సాహో జంట కాబట్టి నార్త్ ఆడియన్స్ కు దీని వల్ల రీచ్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ మేరకు ఆమెను ఒప్పించడం కూడా జరిగిపోయిందంటున్నారు. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ఉంటారా లేదా అనే అనుమానాలకు సంబంధించి క్లారిటీ వచ్చేసిందట.
దాని ప్రకారం ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో పృథ్విరాజ్ ఉండటం ఖాయమేనట. కాకపోతే అఫీషియల్ అనౌన్స్ మెంట్ గ్రాండ్ గా ఇస్తారు. కెజిఎఫ్ రాఖీ భాయ్ అలియాస్ యష్ కూడా ఓ ఎపిసోడ్ లో తళుక్కున కనిపిస్తాడట. అది కథ ప్రకారమా లేక మల్టీ వర్స్ కాన్సెప్ట్ ని విక్రమ్ లో లోకేష్ కనగరాజ్ ఉపయోగించినట్టు ప్రశాంత్ కూడా ఏదైనా ట్విస్ట్ ఇస్తాడా అనేది సినిమా చూశాకే అర్థమవుతుంది. ఒక యాక్షన్ ఎపిసోడ్ ని ఓ పెద్ద లోయలో షూట్ చేయబోతున్నారట. ఒళ్ళు జలదరించే రేంజ్ లో పిక్చరైజేషన్ ఉంటుందని టాక్.
మొత్తానికి సలార్ తో అభిమానులకు ఫీవర్ తెప్పించేలా ఉన్నాడు ప్రశాంత్ నీల్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇప్పటిదాకా సగం పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. విడుదల విషయంలో నిర్మాతలు సైలెంట్ గా ఉన్నారు. 2023 సంక్రాంతికి ఇది లేదా ఆది పురుష్ ఏదో ఒకటి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంతకీ సలార్ ఒక భాగమే ఉంటుందా లేక కెజిఎఫ్ లాగా టూ పార్ట్స్ చేస్తారా అనే దాని గురించి కూడా క్లారిటీ లేదు. మొత్తానికి స్పెషల్ సర్ప్రైజులు చాలానే ఇవ్వబోతున్నారు.
This post was last modified on July 19, 2022 9:02 am
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…