గజినీ లాంటి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ ఇచ్చినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం మురుగదాస్ స్పైడర్ డైరెక్టర్ గానే బాగా గుర్తుండిపోయాడు. మహేష్ బాబు ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని వేస్ట్ చేసుకుని ప్రిన్స్ అభిమానులకు పీడకల మిగిల్చిన దర్శకుడిగా సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రోలింగ్ చూడొచ్చు. తుపాకీ, కత్తి లాంటివి మాకెందుకు ఇవ్వలేదనే ఫ్యాన్స్ కనిపిస్తూ ఉంటారు. గతంలో చిరంజీవితోనూ స్టాలిన్ లాంటి సూపర్ ఫ్లాప్ ఇచ్చిన మురుగదాస్ కొన్నేళ్లుగా తమ మేజిక్ టచ్ కోల్పోయి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు.
రజినీకాంత దర్బార్ ఆశించిన ఫలితం అందుకోలేకపోవడంతో అప్పటినుంచి మురుగదాస్ కు భారీ గ్యాప్ వచ్చేసింది. కోలీవుడ్ స్టార్ హీరోలు అతను చెప్పే కథల మీద ఆసక్తి చూపించడం లేదు. ఇక మనవాళ్ళ గురించి చెప్పేదేముంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మహా అయితే అపాయింట్మెంట్ ఇస్తారేమో కాదు ప్రాజెక్టు మాత్రం కాదు. ఈ నేపథ్యంలో మురుగదాస్ వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న జనం మదిలో మెదులుతోంది. దానికి సమాధానం అమీర్ ఖాన్ సహాయంతో బాలీవుడ్ లో అడుగుపెట్టడం ద్వారా ఇవ్వబోతున్నారట దాస్.
సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ ని మురుగదాస్ ప్లాన్ చేస్తున్నారట. ఇటీవలే ఇద్దరినీ కలిసి లైన్ చెబితే వాళ్ళకు నచ్చిందట. అయితే ఫైనల్ వెర్షన్ అయ్యాక గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ మధ్యవర్తిత్వం అంతా గజిని ఇచ్చిన అభిమానంతో అమీరే చేశాడు. సల్మాన్ షారుఖ్ లు కలిసి నటించి దశాబ్దాలవుతోంది. అప్పుడెప్పుడో 1995లో చేసిన కరణ్ అర్జున్ గురించే ఇప్పటికీ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు. మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత అంటే రికార్డే. నిజంగా దాస్ కనక ఈ కాంబోని ఒప్పించగలిగితే అంతకన్నా గొప్ప ఘనత ఏముంటుంది
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…