ప్రకాష్ రాజ్ కేవలం నటుడే కాదు.. నిర్మాత, దర్శకుడు కూడా. ఆయన ఇప్పటికే స్వీయ దర్శకత్వంలో నాలుగు చిత్రాలు నిర్మించారు. ఐతే అవేవీ సొంత కథలతో తీసిన స్ట్రెయిట్ సినిమాలు కావు. ధోని ఓ మరాఠీ సినిమాకు రీమేక్ కాగా.. ఉలవచారు బిరియాని మలయాళ రీమేక్. అలాగే కన్నడలో ఆకాశమంత చిత్రాన్ని రీమేక్ చేశారాయన. తెలుగులో మన వూరి రామాయణం పేరుతో ప్రకాష్ రాజ్ తెరకెక్కించిన చిత్రం కూడా రీమేకే కావడం గమనార్హం.
ఇందులో ఏ సినిమా కూడా అనుకున్నంతగా ఆడలేదు. ప్రకాష్ రాజ్కు మంచి పేరు తప్ప డబ్బులు తెచ్చిపెట్టలేదు. దీంతో చాన్నాళ్లుగా ఆయన దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. కానీ త్వరలోనే ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నారట. మనలో ఒకడు పేరుతో ఓ కొత్త సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించబోతున్నట్లు ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మళ్లీ దర్శకత్వం వహించబోతుండడం గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. వృత్తిపరంగా, గుర్తింపుపరంగా, రిలెవెన్స్ పరంగా నేను ముందు నటుణ్ణి. నటుడిగా ఇంకొకరి పెయింటింగ్లో నేను కలర్ని. కొన్ని పెయింటింగ్లు మనమే గీయాలనిపిస్తుంది. ఇప్పుడు ‘మనలో ఒకడు’ అనే సినిమా డైరెక్ట్ చేయబోతున్నాను. నాకు చెప్పాలనిపించింది కాబట్టి నేను ఏ సినిమా డైరెక్ట్చేసినా నేనే నా స్వార్జితంతో నిర్మిస్తాను అని ప్రకాష్ రాజ్ తెలిపాడు.
ఐతే ప్రకాష్ రాజ్ తెలిసి అన్నాడో తెలియక అన్నాడో కానీ.. మనలో ఒకడు అనే టైటిల్తో ఇప్పటికే ఓ సినిమా వచ్చింది. అది మరీ పాత సినిమా కూడా కాదు. 2016లో విడుదలైంది. ఆ చిత్రంలో కథానాయకుడిగా నటించడమే కాక దర్శకత్వం కూడా తనే చేశాడు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. అది సొసైటీలో ఓ కీలక సమస్య చుట్టూ తిరిగే సినిమా. ప్రకాష్ రాజ్ సైతం సామాజిక, రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ సినిమా చేయాలని భావిస్తున్నట్లున్నాడు. మరి ఇదే పేరుతో సినిమా ఉందని తెలిస్తే ఆయనే టైటిల్ పెడతారో?
This post was last modified on July 18, 2022 10:51 am
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…