ప్రకాష్ రాజ్కు విలక్షణ నటుడు అనే పేరు ఊరికే రాలేదు. మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్లో ఆయన ఎన్నో అద్భుతమైన, వైవిధ్యమైన పాత్రలు చేశారు. కానీ అప్పుడప్పుడూ ఆయన కొన్ని రొటీన్ క్యారెక్టర్లు కూడా చేయక తప్పలేదు. అవి మొహమాటానికి చేసి ఉండొచ్చు. డబ్బు కోసం చేసి ఉండొచ్చు. కారణాలు ఏవైతేనేం అందరు నటుల మాదిరే ప్రకాష్ రాజ్ కూడా తనకు అంతగా ఇష్టం లేని, రొటీన్ పాత్రలు చాలానే చేశాడు కెరీర్లో.
అలాంటి పాత్రల్లో మహేష్ బాబు మూవీ సరిలేరు నీకెవ్వరులో చేసిన విలన్ పాత్ర కూడా ఒకటని ఆయన చెప్పకనే చెప్పారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీరు చేసిన పాత్రల్లో కష్టంగా అనిపించినవి ఏవి అని అడిగితే.. సరిలేరు నీకెవ్వరు లాంటి కమర్షియల్ సినిమాల్లో అబద్ధాలు చెప్పే పాత్రల్లో, సన్నివేశాల్లో నటించడం తనకు చాలా కష్టంగా అనిపించిందని ఆయన వెల్లడించారు.
ఒక మూస తరహాలో సాగే సినిమాలు చేయడం అంటే తనకు ఆసక్తి ఉండదని.. కానీ ఏదో తప్పక చేస్తామని, అక్కడ మన ఆలోచనలకు అవకాశం ఉండదని, పాత్రలో లీనం కామని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించాడు. తన వరకు కాంజివరం, ఆకాశమంత, బొమ్మరిల్లు, మేజర్ లాంటి సినిమాల్లో చేసిన పాత్రలు చాలా ఇష్టమని.. అలాంటి సినిమాల్లో ఒక లైఫ్ ఉంటుందని ప్రకాష్ రాజ్ అన్నాడు. మనసుకు నచ్చిన పాత్రలు వచ్చినపుడు తాను తక్కువ పారితోషకం తీసుకుని నటిస్తానని ప్రకాష్ రాజ్ చెప్పాడు.
కమర్షియల్ సినిమాలకు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ, నచ్చిన సినిమాలకు తక్కువ పుచ్చుకుంటానని.. ఇలా సమతూకం పాటిస్తుంటానని చెప్పాడాయన. మహేష్ హీరోగా చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో విలన్ పాత్ర చేశాక ఆయన ప్రొడక్షన్లోనే తెరకెక్కిన మేజర్ మూవీ చేసి బ్యాలెన్స్ చేసినట్లుగా ప్రకాష్ రాజ్ చెప్పాడు. మేజర్ సినిమాలో మేజర్ ఉన్నికృష్ణన్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 17, 2022 9:27 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…