Movie News

మేలు చేసిన ఓటిటే ఇప్పుడు శత్రువైంది

థియేటర్లకు కలెక్షన్లు నానాటికి తగ్గిపోతుండటం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితే. ప్రత్యేకంగా ఇది టాలీవుడ్ లోనే లేదు. ఇంకా చెప్పాలంటే మనం చాలా నయం. హిందీ సినిమాల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. గత మూడేళ్ళలో అయిదు వందల కోట్లు తెచ్చిన బాలీవుడ్ మూవీ ఒక్కటంటే ఒక్కటి లేదు. అందుకే ఆగస్ట్ 1 నుంచి కనీసం ఎనిమిది నుంచి పది వారాలు థియేటర్ కు ఓటిటి మధ్య గ్యాప్ ఉండేలా అక్కడి నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. దీని వెనుక మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ మద్దతు బలంగా ఉంది.

మనవాళ్ళు కూడా ఆ మధ్య ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఒకప్పుడు ఇదే ఓటిటి కరోనా కాలంలో ఎందరు నిర్మాతలను నష్టాలబారిన పడకుండా కాపాడిందో చూశాం. డైరెక్ట్ డిజిటల్ బాట పట్టిన కొన్ని డిజాస్టర్లు ఒకవేళ బిగ్ స్క్రీన్ మీద రిలీజ్ అయ్యుంటే ఆ ప్రొడ్యూసర్లు చవిచూడాల్సిన నష్టాలు లెక్కేసుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. లాక్ డౌన్ మొత్తం అయ్యాక ఇప్పుడు చాలా సినిమాలు మూడు వారాల విండోతో ఓటిటిలో వచ్చేస్తున్నాయి. దాని వల్లే కలెక్షన్లు లేవని భావిస్తున్న నిర్మాతలు అడ్డుకట్ట వేయాలని ట్రై చేస్తున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ కేవలం దీనివల్లే ఇప్పటికిప్పుడు ప్రేక్షకులు మారిపోరు. బలమైన కంటెంట్ నే థియేటర్లలో ఆదరిస్తున్నారు. ఇందులో ఎలాంటి డిబేట్ అక్కర్లేదు. ఒకప్పటిలా యావరేజ్ సినిమాలుకు సైతం డీసెంట్ కలెక్షన్లు వచ్చే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు కేవలం కాంబినేషన్లు క్రేజ్ లను నమ్ముకుని నిర్మాణాలు చేస్తే మాత్రం ఎదురుదెబ్బలు తప్పవని అక్షయ్ కుమార్ జాన్ అబ్రహం లాంటి బడా హీరోల చిత్రాలే ఋజువు చేశాయి. అలాంటప్పుడు బాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు కఠినంగా అమలు చేయాలని పెట్టుకున్న నిబంధనలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో చెప్పలేం. అవి సౌత్ మేకర్స్ కూ ఉపయోగపడతాయి. చూద్దాం

This post was last modified on July 18, 2022 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

11 hours ago