ఇటీవలే ‘ఎఫ్-3’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. కరోనా టైంలో మిగతా హీరోలతో పోలిస్తే వెంకీ మంచి స్పీడే చూపించాడు. చకచకా రీమేక్ సినిమాలు నారప్ప, దృశ్యం-2లను పూర్తి చేసి వాటిని ఓటీటీల్లో రిలీజ్ చేసిన వెంకీ.. ఆ తర్వాత ‘ఎఫ్-3’ని థియేటర్లలోకి దించాడు. ఇవి మూడు వాటి వాటి స్థాయిలో మంచి స్పందనే తెచ్చుకున్నాయి. ఐతే కరోనా టైంలోనూ ఏమాత్రం అవకాశం దొరికినా షూటింగ్లో పాల్గొంటూ చేతిలో ఉన్న సినిమాలను వేగంగా పూర్తి చేసిన వెంకీ.. ఇప్పుడు మాత్రం తాపీగా కనిపిస్తున్నాడు. కొత్త సినిమాల విషయంలో ఎటూ తేల్చకుండా సైలెంటుగా ఉన్నాడు.
నిజానికి ఈ టైంకి వెంకీ.. తరుణ్ భాస్కర్తో కొత్త సినిమా చేయాల్సింది. కానీ వాళ్లిద్దరి మధ్య కథా చర్చలు ఒక కొలిక్కి రాక.. ఆ కలయిక సాధ్యపడలేదు. మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కభీ ఈద్ కభీ దివాలి’ చిత్రంలో అతిథి పాత్ర చేయడానికి వెంకీ ఒప్పుకున్నాడు కానీ.. దాని షెడ్యూల్ మొదలవడానికి సమయం ఉంది. దీంతో వెంకీ ప్రస్తుతానికి ఖాళీనే. ఐతే అతి త్వరలో వెంకీ కొత్త చిత్రం గురించి ప్రకటన రాబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ కేవీతో వెంకీ సినిమా దాదాపు ఓకే అయినట్లే చెబుతున్నారు. వీరి కాంబినేషన్ గురించి ఇంతకుముందే వార్తలొచ్చాయి. కానీ ఆలోపే అనుదీప్.. తమిళ హీరో శివకార్తికేయన్తో ‘ప్రిన్స్’ సినిమాను లైన్లో పెట్టాడు. ఆ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. దీపావళికి విడుదల అవుతుంది. అది రిలీజవ్వగానే వెంకీతో అనుదీప్ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని అంటున్నారు. మరి కామెడీ పండించడంలో తిరుగులేని వెంకీతో.. ఈ తరం అభిరుచికి తగ్గట్లుగా నవ్వించగలడని పేరున్న అనుదీప్ మంచి కామెడీ ఎంటర్టైనర్ తీస్తాడేమో చూడాలి.
This post was last modified on July 16, 2022 2:26 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…