ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ‘తుల్లువదో ఎలమై’ అనే ఒక చిన్న సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసి, ఆ తర్వాత తమిళ సినిమాలో ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు ధనుష్. ప్రస్తుతం తమిళంలో పెద్ద స్టార్లలో అతనొకడు. తమిళనాడు అవతల వేరే తమిళ స్టార్లు చాలామందికి లేని గుర్తింపు అతడికి ఉంది. అనువాద చిత్రాలతోనే తెలుగులోనూ తనకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. రాన్జానా, షమితాబ్, ఆత్రంగిరే చిత్రాలతో హిందీలోనూ మంచి గుర్తింపే సంపాదించాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ తనదైన ముద్ర వేయాలని అతను చూస్తున్నాడు.
ఆల్రెడీ ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్’ అనే సినిమాతో అంతర్జాతీయ ప్రేక్షకులనూ పలకరించాడు ధనుష్. కానీ ఆ సినిమా చాలా ఆలస్యం అయి.. చివరికి రిలీజ్ తర్వాత సరైన స్పందనా తెచ్చుకోలేదు. అయినా ధనుష్ నిరాశ చెందలేదు. అతడికి ఇంకో భారీ ఇంటర్నేషనల్ మూవీలో అవకాశం దక్కింది. అదే.. ‘ది గ్రే మ్యాన్’.
‘ఎవెంజర్స్’తో పాటు ‘కెప్టెన్ అమెరికా: వింటర్ సోల్జర్’ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రుసో బ్రదర్స్ నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన సినిమా ఇది. ర్యాన్ గాస్లింగ్, క్రిస్ ఎవన్స్లాంటి టాప్ హాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇందులో ధనుష్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించాడు. అంతర్జాతీయ స్థాయిలో ధనుష్ కెరీర్కు ఈ చిత్రం ఒక గొప్ప మలుపు అవుతుందని అంతా ఆశించారు. కానీ నెట్ప్లిక్స్ సంస్థ ఏకంగా రూ.200 కోట్లు పెట్టి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులకు నిరాశే కలిగించేలా ఉందన్నది టాక్.
ఈ నెల 22న నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేయనుండగా.. ముందే యుఎస్లో ప్రముఖులకు, మీడియాకు స్పెషల్ ప్రిమియర్స్ వేశారు. ఈ కార్యక్రమానికి ధనుష్ తన ఇద్దరు కొడుకులతో వెళ్లి సందడి చేశాడు. కానీ ఈ ప్రిమియర్ల తర్వాత వచ్చిన రివ్యూలన్నీ నెగెటివ్గానే ఉన్నాయి. ఊరికే ఆడంబరం తప్ప సినిమాలో విషయం లేదని అందరూ తేల్చిపడేస్తున్నారు. రివ్యూల్లో ధనుష్ గురించి ప్రస్తావన కూడా కరవైన పరిస్థితి. ట్రైలర్లో కూడా ధనుష్ కనిపించింది కొన్ని సెకన్లే. సినిమాలో అతడికి ప్రాధాన్యం కూడా తక్కువే అని తెలుస్తోంది. ఓవైపు నెగెటివ్ టాక్, మరోవైపు తన పాత్రకు ప్రాధాన్యం అంతంతమాత్రమే కావడంతో ధనుష్కు తీవ్ర నిరాశ తప్పేలా లేదు.
This post was last modified on July 15, 2022 11:30 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…