లలిత్ మోడీ గుర్తున్నాడా? అంత సులువుగా మరిచిపోయే పేరైతే కాదది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా లీగ్స్లో ఒకటిగా ఎదిగి ఏటా బీసీసీఐకి వేల కోట్ల ఆదాయం తెచ్చి పెడుతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్కు శ్రీకారం చుట్టింది ఇతనే. ఐపీఎల్ ఛైర్మన్గా కొన్నేళ్ల పాటు అతను భారత క్రికెట్లో చక్రం తిప్పడం అందరికీ తెలిసిందే. కానీ బీసీసీఐలో కొన్ని అవకతవకలకు పాల్పడ్డమే కాక.. బయట కూడా కొన్ని ఆర్థిక వివాదాల్లో చిక్కుకుని చాలా ఏళ్ల కిందటే దేశం విడిచి వెళ్లిపోయాడు లలిత్ మోడీ.
విజయ్ మాల్యా, నీరవ్ మోడీల తరహాలోనే అతను కూడా లండన్లోనే సెటిలయ్యాడు. ఇండియాలో అతడి మీద కేసులున్నాయి. ఇక్కడికి వచ్చాడంటే అరెస్టయి జైలుకు వెళ్లక తప్పదు. ఈ స్థితిలో లండన్లోనే ఉండిపోయాడు. తిరిగి ఇండియాకు వచ్చే సూచనలే కనిపించడం లేదు. అతడి కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తితో మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ ప్రేమలో పడిందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
1994లో విశ్వ సుందరిగా నిలిచి.. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్గా చాలా ఏళ్లు అలరించిన సుస్మిత ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. వేర్వేరు సమయాల్లో ఆమెకు వేర్వేరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ.. ఎవ్వరితో ఏడడుగులు మాత్రం నడవలేదు. పెళ్లి చేసుకోకపోయినా ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని వారికి తల్లిగా వ్యవహరిస్తూ వచ్చిన సుస్మిత ఎట్టకేలకు పెళ్లి వైపు అడుగులేస్తోంది. ఆమె లండన్లో కొంత కాలంగా లలిత్ మోడీతో డేటింగ్ చేస్తున్న విషయం ఇప్పుడు వెల్లడైంది.
సుస్మితనే స్వయంగా తాను లలిత్ను పెళ్లాడబోతున్న విషయాన్ని వెల్లడించినట్లుగా బాలీవుడ్ మీడియా పేర్కొంటోంది. దీని గురించి లలిత్ మోడీ ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. తాను, సుస్మిత ప్రస్తుతం డేటింగ్ మాత్రమే చేస్తున్నామని.. త్వరలోనే పెళ్లి కూడా జరగొచ్చని అతను వ్యాఖ్యానించాడు. మరి లలిత్ మోడీకి ఉన్న ఇమేజ్, వివాదాల ప్రకారం చూస్తే.. సుస్మిత ఈ వయసులో అతణ్ని ప్రేమించడం చాలామందికి మింగుడు పడడం లేదు.
This post was last modified on July 15, 2022 9:18 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…