బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేని సమయంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమయ్యాడు. తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో అతను నటించిన ద్విభాషా చిత్రం ‘ది వారియర్’ గురువారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రం ఒకేసారి విడుదలవుతోంది. ఈ సినిమా మీద కేవలం ఆ చిత్ర బృందమే కాదు.. ట్రేడ్ కూడా చాలా ఆశలు పెట్టుకుంది.
గత నెలలో మేజర్, విక్రమ్ సినిమాల తర్వాత బాక్సాఫీస్ దగ్గర సందడే లేదు. నెల రోజుల వ్యవధిలో వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అందులోనూ జులై నెలలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు కనీస స్థాయిలో కూడా ఆకట్టుకోలేదు. దీనికి తోడు భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతుండడంతో జనాలు థియేటర్ల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఇలాంటి సమయంలో రామ్ సినిమా మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి దిగుతోంది.
రామ్-లింగుస్వామి కాంబినేషన్కు ఉన్న క్రేజ్కు తోడు ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో రామ్ జోరుమీదుండడంతో ‘ది వారియర్’ మీద బయ్యర్లు చాలా భరోసాతో భారీ పెట్టుబడులే పెట్టేశారు. ఈ చిత్రానికి రెండు భాషల్లో కలిపి రూ.45 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరగడం గమనార్హం. ఐతే మామూలు రోజుల్లోనే ఇది రామ్కు చాలా పెద్ద టార్గెట్ అంటే.. కొవిడ్ తర్వాత పరిస్థితులు చాలా మారిపోయి, ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయి, అధిక టికెట్ ధరలకు తోడు వర్షాలు ప్రతికూల ప్రభావం చూపుతున్న సమయంలో ఈ టార్గెట్ అందుకోవడం అంటే అంత సులువు కాదు.
టికెట్ల రేట్లు, వర్షాల కారణంగా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ నేపథ్యంలో సినిమాకు చాలా మంచి టాక్ రావడం కీలకం. మరి ఏమేర ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాడు, ఎంత మేర తన బాక్సాఫీస్ స్టామినా చూపిస్తాడు అన్నది ఆసక్తికరం. మరోవైపు సాయిపల్లవి నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘గార్గి’ శుక్రవారం రిలీజవుతోంది. దీనిపై అంచనాలు తక్కువే ఉన్నాయి. మరి ఈ సీరియస్ మూవీతో ఆమె ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.
This post was last modified on July 14, 2022 9:31 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…