‘ఆచార్య’తో బాక్సాఫీస్ దగ్గర పెద్ద షాక్ తిన్నాడు కాబట్టి మెగాస్టార్ చిరంజీవిని కొందరు తక్కువ అంచనా వేస్తుండొచ్చుకానీ.. ఒకప్పుడు ఆయన అలాంటిలాంటి హిట్లు ఇవ్వలేదు. ప్రేక్షకుల మీద మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. ముఖ్యంగా 80, 90, 2000 దశకాల్లో చిరు ప్రభావం మామూలుగా ఉండేది కాదు. అప్పటి యువతకు ఆయన ఆరాధ్యుడు. అలాంటి అభిమానుల్లో సెలబ్రెటీలు కూడా ఉన్నారు.
హైదరాబాద్ క్రికెట్లో ఫేమస్ అయిన డీబీ రవితేజ సైతం చిరంజీవికి పెద్ద అభిమానేనట. అతను ఒకప్పుడు అండర్-16 దశలో విరాట్ కోహ్లితో కలిసి రూం షేర్ చేసుకున్నాడట. ఆ టైంలో అతను ఎప్పుడూ టీవీలో మెగాస్టార్ చిరంజీవి పాటలే చూస్తూ ఉండేవాడట. అప్పుడు కోహ్లి సైతం తనతో కలిసి చిరు పాటలకు స్టెప్పులేసేవాడట. చిరు మీద రవితేజ అభిమానం చూసి.. అతణ్ని ‘చిరు’ అనే పిలిచేవాడట. ఈ విషయాన్ని స్వయంగా రవితేజనే ఇప్పుడు వెల్లడించడం విశేషం.
ప్రస్తుతం డీబీ రవితేజ యూకేలో ఉన్నాడు. బహుశా అక్కడ స్థానిక క్రికెట్ లీగ్స్ ఏమైనా ఆడుతున్నాడేమో తెలియదు. అతను తాజాగా విరాట్ కోహ్లిని కలిశాడు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లి తనను హాయ్ చిరు ఎలా ఉన్నావ్ అనే పలకరించినట్లు అతను వెల్లడించాడు.
ఈ క్రమంలోనే అండర్-16 రోజులను గుర్తు చేసుకున్నాడు. తాను, కోహ్లి కలిసి చిరు పాటలకు స్టెప్పుడేయడం, చిరు మీద తన అభిమానం చూసి విరాట్ తనను ఆ పేరే పెట్టి.. ఇప్పుడు అలాగే పలకరించడం గురించి వెల్లడించాడు రవితేజ. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరు రేంజ్ అది అని, విరాట్ లాంటి ఫేమస్ క్రికెటర్ కూడా తన పాటలకు స్టెప్పులేశాడని.. అదే పేరుతో తన సహచర క్రికెటర్ను పిలిచాడని.. ఇలా తెలుగు రాష్ట్రాల అవతల కూడా సెలబ్రెటీల్లో ఫేమస్ అయిన అరుదైన హీరో ఆయన అని మెగా అభిమానులు కొనియాడుతున్నారు.
This post was last modified on July 13, 2022 6:59 pm
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని…
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…