Movie News

రంగ రంగ …వాయిదా రీజన్ అదేనా ?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రంగ రంగ వైభవంగా ‘ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయింది. ముందుగా సినిమాను మే 27న రిలీజ్ చేయాలనుకున్నారు ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చారు. అంతలోనే మళ్ళీ వాయిదా వేసుకొని జులై 1న ఫిక్స్ చేసుకున్నారు. అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండటంతో మళ్ళీ వాయిదా వేసుకున్నారు. ఇక జులై ఎండింగ్ లేదా ఆగస్ట్ లో సినిమా రిలీజ్ ఉంటుందని టాక్ వినిపించింది. కానీ మేకర్స్ ఏకంగా సెప్టెంబర్ 2 న రిలీజ్ అంటూ ఓ న్యూ రిలీజ్ పోస్టర్ వదిలారు.

ఇలా నెలల తరబడి పోస్ట్ పోస్ట్ చేయడానికి రీజన్ రీ షూట్స్ అని తెలుస్తుంది. అవును దర్శకుడు గిరీశయా తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. సందీప్ రెడ్డి వంగా దగ్గర అర్జున్ రెడ్డి కి అసిస్టెంట్ గా వర్క్ చేసిన ఈ డైరెక్టర్ తర్వాత తమిళ్ లో విక్రమ్ తనయుడు హీరోగా ‘అర్జున్ రెడ్డి’ ని రీమేక్ చేసి అక్కడ హిట్ కొట్టాడు. తాజాగా సందీప్ రెడ్డి మిగతా వ్యక్తులు అవుట్ పుట్ చూసి కొన్ని చేంజెస్ చెప్పారని , అందుకే దర్శకుడు గిరీశాయ కాస్త టైం తీసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్.

ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే వచ్చిన టీజర్ మంచి మార్కులు అందుకుని బజ్ క్రియేట్ చేసింది. బహుశా సినిమా పోస్ట్ పోన్ చేస్తూ మేకర్స్ ఇంకా బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారేమో. ఏదేమైనా ఈ సినిమా ఇంకోసారి కనుక వాయిదా పడితే వచ్చిన బజ్ అంతా హుష్ కాకీ అయినట్టే. మేకర్స్ ఆలోచించుకొని ఇక అదే డేట్ కి స్టిక్ అయితే బెటర్.

This post was last modified on July 13, 2022 6:36 pm

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

40 minutes ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

1 hour ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

13 hours ago