మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రంగ రంగ వైభవంగా ‘ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయింది. ముందుగా సినిమాను మే 27న రిలీజ్ చేయాలనుకున్నారు ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చారు. అంతలోనే మళ్ళీ వాయిదా వేసుకొని జులై 1న ఫిక్స్ చేసుకున్నారు. అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండటంతో మళ్ళీ వాయిదా వేసుకున్నారు. ఇక జులై ఎండింగ్ లేదా ఆగస్ట్ లో సినిమా రిలీజ్ ఉంటుందని టాక్ వినిపించింది. కానీ మేకర్స్ ఏకంగా సెప్టెంబర్ 2 న రిలీజ్ అంటూ ఓ న్యూ రిలీజ్ పోస్టర్ వదిలారు.
ఇలా నెలల తరబడి పోస్ట్ పోస్ట్ చేయడానికి రీజన్ రీ షూట్స్ అని తెలుస్తుంది. అవును దర్శకుడు గిరీశయా తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. సందీప్ రెడ్డి వంగా దగ్గర అర్జున్ రెడ్డి కి అసిస్టెంట్ గా వర్క్ చేసిన ఈ డైరెక్టర్ తర్వాత తమిళ్ లో విక్రమ్ తనయుడు హీరోగా ‘అర్జున్ రెడ్డి’ ని రీమేక్ చేసి అక్కడ హిట్ కొట్టాడు. తాజాగా సందీప్ రెడ్డి మిగతా వ్యక్తులు అవుట్ పుట్ చూసి కొన్ని చేంజెస్ చెప్పారని , అందుకే దర్శకుడు గిరీశాయ కాస్త టైం తీసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్.
ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే వచ్చిన టీజర్ మంచి మార్కులు అందుకుని బజ్ క్రియేట్ చేసింది. బహుశా సినిమా పోస్ట్ పోన్ చేస్తూ మేకర్స్ ఇంకా బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారేమో. ఏదేమైనా ఈ సినిమా ఇంకోసారి కనుక వాయిదా పడితే వచ్చిన బజ్ అంతా హుష్ కాకీ అయినట్టే. మేకర్స్ ఆలోచించుకొని ఇక అదే డేట్ కి స్టిక్ అయితే బెటర్.
This post was last modified on July 13, 2022 6:36 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…