ఈ నెల 22న విడుదల కాబోతున్న నాగ చైతన్య థాంక్ యు మీద అక్కినేని అభిమానులకు గట్టి అంచనాలే ఉన్నాయి. సామాన్య ప్రేక్షకుల్లో ఇప్పటికి ఏమంత బజ్ లేకపోయినా రిలీజ్ టైంకి ప్రమోషన్ల రూపంలో వచ్చేస్తుందని వాళ్ళ నమ్మకం. తాజాగా వచ్చిన ట్రైలర్ అంచనాలు అమాంతం ఎక్కడికో తీసుకెళ్ళేలా లేదు కానీ మజిలీ, ప్రేమమ్, లవ్ స్టోరీ తరహా ఫీల్స్ ఉండటంతో యూత్ లో క్రేజ్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. విక్రమ్ కె కుమార్ టిపికల్ డైరెక్షన్ కన్నా ఒక వ్యక్తి సాఫ్ట్ జర్నీని చూపించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది.
చాలా స్పష్టంగా కథేంటో చెప్పేశారు. ఓ యువకుడు.. చిన్న ఊళ్ళో మొదలైన అతని టీనేజ్ లో అందరిలాగే ప్రేమకథలు ఉంటాయి. ఇష్టపడిన అమ్మాయి దక్కదు. ఇంకో ముద్దుగుమ్మేమో నువ్వు నా అన్నయ్యవని రాఖీ కట్టేసి తనను అవమానించిన వాళ్ళను చితకబాదిస్తుంది. అలా రెండు దశలు దాటాక ఇంకో లవర్ వస్తుంది. మనోడు గొప్ప స్థితికి చేరుకుంటాడు. ఆ తర్వాత తను ఈ స్టేజికి రావడానికి కారణమైన ప్రతిఒక్కరికి థాంక్స్ చెప్పాలని నిర్ణయించుకుంటాడు. నిజంగా అందరినీ కలిశాడా లేదా అనేదే అసలు కథ.
ఇలా అరటిపండు వలిచినట్టు స్టోరీ మొత్తం ట్రైలర్ లోనే విప్పేశారు. సాఫ్ట్ జానర్ కాబట్టి మాస్ కు ఆకట్టుకునే అంశాలు ఏ మేరకు ఉన్నాయో సినిమాలోనే చూడాలి. ఇందులో చైతు మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా కనిపించనున్నాడు. దానికి సంబంధించిన థియేటర్ సీన్లు కూడా ఉన్నాయి. అవి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తాయని వేరే చెప్పాలా. మనం తర్వాత చైతుని డైరెక్ట్ చేస్తున్న విక్రమ్ కె కుమార్ ఆ హిట్ సెంటిమెంట్ ని ఎంతమేరకు రిపీట్ చేస్తారో జూలై 22న చూడాలి. గ్యాంగ్ లీడర్ గాయం మానాల్సింది కూడా దీంతోనే.
This post was last modified on July 12, 2022 10:17 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…