ఈ నెల 22న విడుదల కాబోతున్న నాగ చైతన్య థాంక్ యు మీద అక్కినేని అభిమానులకు గట్టి అంచనాలే ఉన్నాయి. సామాన్య ప్రేక్షకుల్లో ఇప్పటికి ఏమంత బజ్ లేకపోయినా రిలీజ్ టైంకి ప్రమోషన్ల రూపంలో వచ్చేస్తుందని వాళ్ళ నమ్మకం. తాజాగా వచ్చిన ట్రైలర్ అంచనాలు అమాంతం ఎక్కడికో తీసుకెళ్ళేలా లేదు కానీ మజిలీ, ప్రేమమ్, లవ్ స్టోరీ తరహా ఫీల్స్ ఉండటంతో యూత్ లో క్రేజ్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. విక్రమ్ కె కుమార్ టిపికల్ డైరెక్షన్ కన్నా ఒక వ్యక్తి సాఫ్ట్ జర్నీని చూపించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది.
చాలా స్పష్టంగా కథేంటో చెప్పేశారు. ఓ యువకుడు.. చిన్న ఊళ్ళో మొదలైన అతని టీనేజ్ లో అందరిలాగే ప్రేమకథలు ఉంటాయి. ఇష్టపడిన అమ్మాయి దక్కదు. ఇంకో ముద్దుగుమ్మేమో నువ్వు నా అన్నయ్యవని రాఖీ కట్టేసి తనను అవమానించిన వాళ్ళను చితకబాదిస్తుంది. అలా రెండు దశలు దాటాక ఇంకో లవర్ వస్తుంది. మనోడు గొప్ప స్థితికి చేరుకుంటాడు. ఆ తర్వాత తను ఈ స్టేజికి రావడానికి కారణమైన ప్రతిఒక్కరికి థాంక్స్ చెప్పాలని నిర్ణయించుకుంటాడు. నిజంగా అందరినీ కలిశాడా లేదా అనేదే అసలు కథ.
ఇలా అరటిపండు వలిచినట్టు స్టోరీ మొత్తం ట్రైలర్ లోనే విప్పేశారు. సాఫ్ట్ జానర్ కాబట్టి మాస్ కు ఆకట్టుకునే అంశాలు ఏ మేరకు ఉన్నాయో సినిమాలోనే చూడాలి. ఇందులో చైతు మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా కనిపించనున్నాడు. దానికి సంబంధించిన థియేటర్ సీన్లు కూడా ఉన్నాయి. అవి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తాయని వేరే చెప్పాలా. మనం తర్వాత చైతుని డైరెక్ట్ చేస్తున్న విక్రమ్ కె కుమార్ ఆ హిట్ సెంటిమెంట్ ని ఎంతమేరకు రిపీట్ చేస్తారో జూలై 22న చూడాలి. గ్యాంగ్ లీడర్ గాయం మానాల్సింది కూడా దీంతోనే.
This post was last modified on July 12, 2022 10:17 pm
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…