తమిళ దర్శకుల పట్ల తెలుగు హీరోల మోజు ఈనాటిది కాదు. వాళ్లతో మన హీరోలు ఎప్పట్నుంచో సినిమాలు చేస్తూ వస్తున్నారు. కాకపోతే గత కొన్నేళ్లలో కోలీవుడ్ డైరెక్టర్ల ఊపు తగ్గింది. మన దర్శకుల జోరు పెరిగింది. ఈ క్రమంలోనే తమిళ దర్శకుల వెంట పడడం మానేశారు మన హీరోలు. కాగా ఇటీవల తెలుగు హీరోల మార్కెట్ అంతకంతకూ పెరిగిపోతుండటంతో తమిళ దర్శకులే తెలుగు హీరోల వెంట పడుతుండటం విశేషం.
రన్, పందెం కోడి, ఆవారా, వెట్టై లాంటి చిత్రాలతో భారీ విజయాలందుకుని ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగిన లింగుస్వామితో.. ఒక సినిమా చేయాలని ఆశపడ్డ టాలీవుడ్ హీరోలు చాలామందే ఉన్నారు. అందులో ఒకడు అల్లు అర్జున్. కానీ వీరి మధ్య కథా చర్చలు జరిగి, ఒక సినిమాకు రంగం సిద్ధమై అనౌన్స్మెంట్ కూడా అయ్యాక వ్యవహారం మారిపోయింది. లింగుస్వామి వరుసగా సికిందర్, పందెంకోడి-2 లాంటి డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది.
లింగుస్వామి టాలీవుడ్లోకి ఎంట్రీ అయితే ఇస్తున్నాడు కానీ.. అది మిడ్ రేంజ్ హీరో అయిన రామ్తో చేస్తున్న ‘ది వారియర్’ మూవీతో. ఈ సినిమా ఆయన కెరీర్కు చాలా కీలకం. తమిళ స్టార్లు ఆయనతో పని చేయడానికి అంతగా ఆసక్తి చూపించని నేపథ్యంలో తెలుగు స్టార్ల మీదే ఆయన ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూల్లో తెలుగు స్టార్లతో మరిన్ని సినిమాలు చేసే విషయమై ఆయన మాట్లాడాడు.
అల్లు అర్జున్ గురించి ప్రస్తావిస్తే.. “ఆయనతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. మా మధ్య గతంలో ఓ సినిమా కోసం చర్చలు జరిగాయి. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదు. బన్నీ స్టైల్, ఎనర్జీ వేరు. ఆయన తిరుగులేని స్టార్. బన్నీలో నాకు నచ్చే లక్షణాలు చాలా ఉన్నాయి. ఆయనతో ఇంతకుముందు సినిమా కుదరకపోయినా.. త్వరలో కచ్చితంగా సినిమా చేస్తా. ‘ది వారియర్’ రిలీజయ్యాక దాని సంగతి తేలుతుంది” అని లింగుస్వామి చెప్పాడు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్లతోనూ తాను సినిమాలు చేయాల్సిందని.. వారితో గతంలో సంప్రదింపులు జరిగాయని, భవిష్యత్తులో కుదిరితే చేస్తానని అన్నాడు లింగుస్వామి. రామ్తో తాను పది సినిమాలు చేయాలనుకుంటున్నట్లు లింగుస్వామి చెప్పడం విశేషం.
This post was last modified on July 12, 2022 9:38 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…