తమిళ దర్శకుల పట్ల తెలుగు హీరోల మోజు ఈనాటిది కాదు. వాళ్లతో మన హీరోలు ఎప్పట్నుంచో సినిమాలు చేస్తూ వస్తున్నారు. కాకపోతే గత కొన్నేళ్లలో కోలీవుడ్ డైరెక్టర్ల ఊపు తగ్గింది. మన దర్శకుల జోరు పెరిగింది. ఈ క్రమంలోనే తమిళ దర్శకుల వెంట పడడం మానేశారు మన హీరోలు. కాగా ఇటీవల తెలుగు హీరోల మార్కెట్ అంతకంతకూ పెరిగిపోతుండటంతో తమిళ దర్శకులే తెలుగు హీరోల వెంట పడుతుండటం విశేషం.
రన్, పందెం కోడి, ఆవారా, వెట్టై లాంటి చిత్రాలతో భారీ విజయాలందుకుని ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగిన లింగుస్వామితో.. ఒక సినిమా చేయాలని ఆశపడ్డ టాలీవుడ్ హీరోలు చాలామందే ఉన్నారు. అందులో ఒకడు అల్లు అర్జున్. కానీ వీరి మధ్య కథా చర్చలు జరిగి, ఒక సినిమాకు రంగం సిద్ధమై అనౌన్స్మెంట్ కూడా అయ్యాక వ్యవహారం మారిపోయింది. లింగుస్వామి వరుసగా సికిందర్, పందెంకోడి-2 లాంటి డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది.
లింగుస్వామి టాలీవుడ్లోకి ఎంట్రీ అయితే ఇస్తున్నాడు కానీ.. అది మిడ్ రేంజ్ హీరో అయిన రామ్తో చేస్తున్న ‘ది వారియర్’ మూవీతో. ఈ సినిమా ఆయన కెరీర్కు చాలా కీలకం. తమిళ స్టార్లు ఆయనతో పని చేయడానికి అంతగా ఆసక్తి చూపించని నేపథ్యంలో తెలుగు స్టార్ల మీదే ఆయన ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూల్లో తెలుగు స్టార్లతో మరిన్ని సినిమాలు చేసే విషయమై ఆయన మాట్లాడాడు.
అల్లు అర్జున్ గురించి ప్రస్తావిస్తే.. “ఆయనతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. మా మధ్య గతంలో ఓ సినిమా కోసం చర్చలు జరిగాయి. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదు. బన్నీ స్టైల్, ఎనర్జీ వేరు. ఆయన తిరుగులేని స్టార్. బన్నీలో నాకు నచ్చే లక్షణాలు చాలా ఉన్నాయి. ఆయనతో ఇంతకుముందు సినిమా కుదరకపోయినా.. త్వరలో కచ్చితంగా సినిమా చేస్తా. ‘ది వారియర్’ రిలీజయ్యాక దాని సంగతి తేలుతుంది” అని లింగుస్వామి చెప్పాడు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్లతోనూ తాను సినిమాలు చేయాల్సిందని.. వారితో గతంలో సంప్రదింపులు జరిగాయని, భవిష్యత్తులో కుదిరితే చేస్తానని అన్నాడు లింగుస్వామి. రామ్తో తాను పది సినిమాలు చేయాలనుకుంటున్నట్లు లింగుస్వామి చెప్పడం విశేషం.
This post was last modified on July 12, 2022 9:38 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…