తమిళ దర్శకుల పట్ల తెలుగు హీరోల మోజు ఈనాటిది కాదు. వాళ్లతో మన హీరోలు ఎప్పట్నుంచో సినిమాలు చేస్తూ వస్తున్నారు. కాకపోతే గత కొన్నేళ్లలో కోలీవుడ్ డైరెక్టర్ల ఊపు తగ్గింది. మన దర్శకుల జోరు పెరిగింది. ఈ క్రమంలోనే తమిళ దర్శకుల వెంట పడడం మానేశారు మన హీరోలు. కాగా ఇటీవల తెలుగు హీరోల మార్కెట్ అంతకంతకూ పెరిగిపోతుండటంతో తమిళ దర్శకులే తెలుగు హీరోల వెంట పడుతుండటం విశేషం.
రన్, పందెం కోడి, ఆవారా, వెట్టై లాంటి చిత్రాలతో భారీ విజయాలందుకుని ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగిన లింగుస్వామితో.. ఒక సినిమా చేయాలని ఆశపడ్డ టాలీవుడ్ హీరోలు చాలామందే ఉన్నారు. అందులో ఒకడు అల్లు అర్జున్. కానీ వీరి మధ్య కథా చర్చలు జరిగి, ఒక సినిమాకు రంగం సిద్ధమై అనౌన్స్మెంట్ కూడా అయ్యాక వ్యవహారం మారిపోయింది. లింగుస్వామి వరుసగా సికిందర్, పందెంకోడి-2 లాంటి డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది.
లింగుస్వామి టాలీవుడ్లోకి ఎంట్రీ అయితే ఇస్తున్నాడు కానీ.. అది మిడ్ రేంజ్ హీరో అయిన రామ్తో చేస్తున్న ‘ది వారియర్’ మూవీతో. ఈ సినిమా ఆయన కెరీర్కు చాలా కీలకం. తమిళ స్టార్లు ఆయనతో పని చేయడానికి అంతగా ఆసక్తి చూపించని నేపథ్యంలో తెలుగు స్టార్ల మీదే ఆయన ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూల్లో తెలుగు స్టార్లతో మరిన్ని సినిమాలు చేసే విషయమై ఆయన మాట్లాడాడు.
అల్లు అర్జున్ గురించి ప్రస్తావిస్తే.. “ఆయనతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. మా మధ్య గతంలో ఓ సినిమా కోసం చర్చలు జరిగాయి. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదు. బన్నీ స్టైల్, ఎనర్జీ వేరు. ఆయన తిరుగులేని స్టార్. బన్నీలో నాకు నచ్చే లక్షణాలు చాలా ఉన్నాయి. ఆయనతో ఇంతకుముందు సినిమా కుదరకపోయినా.. త్వరలో కచ్చితంగా సినిమా చేస్తా. ‘ది వారియర్’ రిలీజయ్యాక దాని సంగతి తేలుతుంది” అని లింగుస్వామి చెప్పాడు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్లతోనూ తాను సినిమాలు చేయాల్సిందని.. వారితో గతంలో సంప్రదింపులు జరిగాయని, భవిష్యత్తులో కుదిరితే చేస్తానని అన్నాడు లింగుస్వామి. రామ్తో తాను పది సినిమాలు చేయాలనుకుంటున్నట్లు లింగుస్వామి చెప్పడం విశేషం.
This post was last modified on July 12, 2022 9:38 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…