టాలీవుడ్ లో ఇటీవల డిసైడ్ చేసిన నిర్ణయం ఒకటి వుంది. ఏ పెద్ద సినిమా అయినా ఎనిమిది వారాల్లోగా ఓటిటికి ఇవ్వకూడదు. మిగిలిన సినిమాలు నాలుగు వారాల వరకు ఓటిటికి ఇవ్వకూడదు. అదీ నిర్ణయం. కానీ ఇప్పటికే అగ్రిమెంట్లు పూర్తయిన సినిమాల విషయంలో మాత్రం ఈ నిబంధన వర్తించదు. అందుకే ఇప్పటికెే అగ్రిమెంట్లు పూర్తయిన సినిమాలు ఆ అగ్రిమెంట్లను గిల్డ్ కు అందించాలని కోరారు.
ఇలాంటి నేపథ్యంలో వస్తున్న ది వారియర్ సినిమా చాలా త్వరలోనే ఓటిటిలో ప్రత్యక్షం అవుతుందనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇవి ఎంత వరకు నిజం అన్నది క్లారిటీ లేదు కానీ ఈ వార్తలు విని బయ్యర్లు కలవరపడుతున్నట్లు బోగట్టా. ఎందుకంటే ఈ సినిమాను 30 కోట్ల మేరకు థియేటర్ మార్కెట్ చేసారు. ఇంత అమౌంట్ రికవరీ కావాలంటే సినిమా పెద్ద హిట్ కావడమే ముఖ్యం కాదు. నాలుగు వారాల పాటు రన్ కూడా వుండాలి. మేజర్ సెంటర్లలో పెద్ద సినిమాలు అన్నీ నాలుగు వారాలు సులువుగా ఆడతాయి. ఎంత టాక్ బాగా లేకున్నా కూడా ఎక్కడో ఓ థియేటర్ లో రన్ చేస్తూనే వుంటారు.
అలాంటిది నాలుగు వారాల్లో ఓటిటికి వస్తే మాత్రం కష్టం అవుతుంది. వారియర్ సినిమా మీద మంచి బజ్ వుంది హొప్ వుంది. అందువల్ల ఈ సినిమా ఓటిటికి అంత త్వరగా రాదనే ఆశిద్దాం. అలా అయితేనే నిర్మాతలు బాగుంటారు. బయ్యర్లు బాగుంటారు.
This post was last modified on July 12, 2022 6:32 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…