కరోనా వైరస్ వివిధ రంగాల్లో ప్రముఖుల్ని కూడా వదిలిపెట్టలేదు. తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. కరోనా ఉన్నట్లు బయటపడ్డ ప్రముఖుడంటే బండ్ల గణేషే. ఆయనకు రెండు వారాల కిందట కరోనా ఉన్నట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. కానీ గణేష్ మాత్రం ఈ విషయమై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కరోనా పాజిటివ్గా తేలాక రెండు మూడు రోజులు ట్విట్టర్లో ఇన్ యాక్టివ్ అవ్వడంతోనే బండ్లకు వైరస్ సోకిందని చాలామంది అర్థం చేసుకున్నారు. చాలామంది సెలబ్రెటీలు ఓపెన్గా తమకు కరోనా ఉన్న సంగతి వెల్లడించి సామాన్య జనాల్లో భయం పోగొట్టే ప్రయత్నం చేస్తుండగా.. బండ్ల మాత్రం సైలెంటుగా ఉన్నాడు.
ఐతే బండ్ల గణేష్ నుంచి మంగళవారం కరోనా అప్ డేట్ రావడం విశేషం. తనకు కరోనా ఉన్నట్లు చెప్పుకోని గణేష్.. ఇప్పుడు నెగెటివ్ వచ్చినట్లు అప్ డేట్ ఇవ్వడం విశేషం. కరోనా పరీక్షలో తనకు నెగెటివ్ వచ్చిన రిపోర్టును అతను ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతో అతడి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అయితే చాలామంది నెటిజన్లు అసలు మీకు కరోనా ఉన్నట్లు చెప్పలేదేంటి.. అప్పుడు సైలెంటుగా ఉండి ఇప్పుడు నెగెటివ్ వచ్చిందని ఎందుకు అప్ డేట్ ఇస్తున్నారు అని ప్రశ్నించారు. అయితే బండ్ల ఇదేమీ పట్టించుకోకుండా పాజిటివ్గా స్పందించిన వారికి జవాబులిస్తూ ఉండిపోయాడు. పౌల్ట్రీ బిజినెస్ నడిపే బండ్ల వ్యాపారంలో భాగంగా చాలామందితో కాంటాక్ట్ కావడంతో అతడికి కరోనా వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. బండ్లకు ఇటీవలే ట్విట్టర్లో టిక్ మార్కు (అధికారిక ధ్రువీకరణ) రావడం విశేషం.
This post was last modified on July 1, 2020 8:51 am
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…