ఇప్పుడు ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న రైటర్ అంటే విజయేంద్ర ప్రసాదే. బాహుబలి, భజరంగి భాయిజాన్, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఆయన కీర్తి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరింది. 80 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో చురుగ్గా కనిపిస్తూ, కొత్త సినిమాలకు కథలు రాస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే మోడీ సర్కారు ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆయన రాజమౌళి-మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమాకు కథ రాసే పనిలో ఉన్నారు. దాంతో పాటుగా రజాకార్ల నేపథ్యంలో తెరకెక్కబోయే సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో సినిమా చేయడానికి చాలామంది ప్రయత్నించారు కానీ.. అవేవీ కార్యరూపం దాల్చలేదు. చివరికి సుకుమార్ సైతం తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ల మీద రీసెర్చ్ చేసి ఓ కథ రెడీ చేయాలని గతంలో ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు.
కాగా ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఈ బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. కాగా బీజేపీ ప్రభుత్వం విజయేంద్ర ప్రసాద్ను రాజ్యసభకు నామినేట్ చేయడం, ఇటీవలే ఆ పార్టీ నేతలు ఆయన్ని కలవడంతో.. ఇదే సమయంలో ఈ సినిమా గురించి విజయేంద్ర ప్రకటించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. బీజేపీ నేతల ప్రోద్బలంతో, వారి ఆర్థిక సహకారంతోనే ఈ సినిమానే తెరకెక్కనుందనే ప్రచారం కూడా ఊపందుకుంది.
దీనిపై విజయేంద్ర క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను కథ తయారు చేస్తున్న సమయంలో వారు నన్ను కలవడం కాకతాళీయం. ఈ సినిమాకు వారికి సంబంధమే లేదు. నా సినిమాకు నిర్మాతలెవరో త్వరలో వెల్లడిస్తా. ఈ చిత్రానికి నేను కథ మాత్రమే అందిస్తా. దర్శకత్వం చేయబోను. నేను హిందీలో కథ అందించిన ‘బజరంగీ భాయిజాన్’ చిత్రంలో హీరో ఆంజనేయ స్వామి భక్తుడు. పాకిస్థాన్ నుండి ఇండియాకి వచ్చిన ఓ చిన్నపాప ఇక్కడ తప్పిపోతే, హీరో ఆమెను ఎలా తిరిగి తన ఇంటికి చేర్చాడన్నదే ఆ చిత్ర కథ. ఇందుకోసం ఆయన పాకిస్థాన్తో ఎలాంటి యుద్ధం చేయలేదు. రజాకార్ల నేపథ్యంలో నేను చేయబోయే సినిమా కూడా అలాగే ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉన్న చోట వేదన ఎక్కువగా ఉంటుంది. ఆ వేదనను అధిగమించి కూడా మానవత్వం చూపిస్తే అది గుండెలకు హత్తుకుంటుంది. మంచి సినిమా అవుతుంది. సినిమా పరంగా మంచి డ్రామా పండుతుందని రజాకార్ల నేపథ్యాన్ని ఎన్నుకున్నాను. అంతే. సినిమా చూశాక జనం కళ్లనీళ్లతో బయటకు రావాలి. అంతే తప్ప వేరే ఉద్దేశమేమీ లేదు’’ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
This post was last modified on July 12, 2022 3:31 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…