మెగాస్టార్ చిరంజీవితో మాస్ రాజా రవితేజ సుదీర్ఘ విరామం తర్వాత జట్టు కట్టబోతున్నట్లుగా గత ఏడాదే సమాచారం బయటికి వచ్చింది. గతంలో వీళ్లిద్దరూ ‘అన్నయ్య’ సినిమాలో నటించారు. ఐతే అప్పటికి రవితేజ హీరో కాదు. అతడికి ఎలాంటి ఇమేజ్ లేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద మాస్ హీరోల్లో రవితేజ ఒకడు.
సోలో హీరోగా ఒక రేంజిలో ఉన్న అతను.. వేరే సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసే స్థితిలో లేడు. కాబట్టి ఇప్పుడు చిరుతో జత కడుతున్నాడంటే అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ‘పవర్’ సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చిన కేఎస్ రవీంద్ర (బాబీ) మీద అభిమానంతో, అలాగే చిరు మీద ప్రేమతో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించడానికి రవితేజ ముందుకొచ్చినట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల మాస్ రాజా ఈ సినిమా చేయలేకపోతున్నట్లుగా ఈ మధ్య గుసగుసలు వినిపించాయి. కానీ ఈ వార్తలు నిజం కాదని తేలింది.
అతి త్వరలోనే మాస్ రాజా ‘వాల్తేరు వీరయ్య’ సెట్స్లో అడుగు పెట్టబోతున్నాడు. ఈ సినిమా కోసం నెల రోజులకు పైగానే డేట్లు కేటాయించాడట రవితేజ. ఇటీవలే ‘రామారావు ఆన్ డ్యూటీ’ పని పూర్తి చేసిన రవితేజ.. తన సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకుని చిరు సినిమా కోసం డేట్లు ఇచ్చాడట.
హైదరాబాద్లోనే కాక ఫారిన్లో జరిగే షెడ్యూళ్లలో అతను పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరుకు సోదరుడిగా రవితేజ నటించబోతున్నాడని.. అతడి ఇమేజ్కు తగ్గ మాస్ పాత్ర ఇదని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పని పూర్తయ్యాకే ‘ధమాకా’ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నాడట రవితేజ.
చిరు సినిమాలో నటించడానికి రవితేజ భారీగానే పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘ఆచార్య’ డిజాస్టర్ కావడంతో బడ్జెట్ విషయంలో జాగ్రత్త పడే క్రమంలో రవితేజ బదులు చిన్న ఆర్టిస్టును పెట్టుకుందామని అనుకున్నారు కానీ.. మాస్ రాజా ఈ పాత్రను చేస్తే సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో రాజీ పడకుండా అతడితోనే వెళ్తున్నట్లు సమాచారం.
This post was last modified on July 11, 2022 2:28 pm
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…