మెగాస్టార్ చిరంజీవితో మాస్ రాజా రవితేజ సుదీర్ఘ విరామం తర్వాత జట్టు కట్టబోతున్నట్లుగా గత ఏడాదే సమాచారం బయటికి వచ్చింది. గతంలో వీళ్లిద్దరూ ‘అన్నయ్య’ సినిమాలో నటించారు. ఐతే అప్పటికి రవితేజ హీరో కాదు. అతడికి ఎలాంటి ఇమేజ్ లేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద మాస్ హీరోల్లో రవితేజ ఒకడు.
సోలో హీరోగా ఒక రేంజిలో ఉన్న అతను.. వేరే సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసే స్థితిలో లేడు. కాబట్టి ఇప్పుడు చిరుతో జత కడుతున్నాడంటే అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ‘పవర్’ సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చిన కేఎస్ రవీంద్ర (బాబీ) మీద అభిమానంతో, అలాగే చిరు మీద ప్రేమతో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించడానికి రవితేజ ముందుకొచ్చినట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల మాస్ రాజా ఈ సినిమా చేయలేకపోతున్నట్లుగా ఈ మధ్య గుసగుసలు వినిపించాయి. కానీ ఈ వార్తలు నిజం కాదని తేలింది.
అతి త్వరలోనే మాస్ రాజా ‘వాల్తేరు వీరయ్య’ సెట్స్లో అడుగు పెట్టబోతున్నాడు. ఈ సినిమా కోసం నెల రోజులకు పైగానే డేట్లు కేటాయించాడట రవితేజ. ఇటీవలే ‘రామారావు ఆన్ డ్యూటీ’ పని పూర్తి చేసిన రవితేజ.. తన సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకుని చిరు సినిమా కోసం డేట్లు ఇచ్చాడట.
హైదరాబాద్లోనే కాక ఫారిన్లో జరిగే షెడ్యూళ్లలో అతను పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరుకు సోదరుడిగా రవితేజ నటించబోతున్నాడని.. అతడి ఇమేజ్కు తగ్గ మాస్ పాత్ర ఇదని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పని పూర్తయ్యాకే ‘ధమాకా’ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నాడట రవితేజ.
చిరు సినిమాలో నటించడానికి రవితేజ భారీగానే పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘ఆచార్య’ డిజాస్టర్ కావడంతో బడ్జెట్ విషయంలో జాగ్రత్త పడే క్రమంలో రవితేజ బదులు చిన్న ఆర్టిస్టును పెట్టుకుందామని అనుకున్నారు కానీ.. మాస్ రాజా ఈ పాత్రను చేస్తే సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో రాజీ పడకుండా అతడితోనే వెళ్తున్నట్లు సమాచారం.
This post was last modified on July 11, 2022 2:28 pm
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవడం సవాలుగా మారింది. తెలుగులో…
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. నిన్న ఒకే రోజు ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చినప్పటికీ.. దేశమంతా ఎక్కువ…
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…