డాన్స్ మాస్టర్ గా టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ గుర్తింపే ఉన్న అమ్మ రాజశేఖర్ కు హీరో నితిన్ మీద కోపమొచ్చింది. సాధారణంగా టెక్నీషియన్ ఎవరైనా సరే పబ్లిక్ స్టేజిల మీద స్టార్లను విమర్శించేందుకు ఆలోచించే పరిస్థితుల్లో నేరుగా తిట్ల బాణాలు గుప్పించడం మీడియాకు సైతం షాక్ కలిగించింది. విషయంలోకి వెళ్తే అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో హైయ్ ఫైవ్ అనే సినిమా రూపొందింది. దీన్ని ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు. ఎప్పుడు తీశారో ఎవరు నటించారో కూడా తెలియనంత గప్ చుప్ గా షూటింగ్ జరిగింది.
నిన్న దీని తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అమ్మ రాజశేఖర్ పది రోజుల క్రితం నితిన్ ని అతిథిగా పిలిచాడు. అతనూ వస్తానని మాటిచ్చాడు. తీరా చూస్తే జ్వరమని చెప్పి చివరి నిమిషంలో నిస్సహాయత వ్యక్తం చేశాడు. ఇందులో నిజం లేదంటున్నాడు రాజశేఖర్. గత రెండు వారాలుగా నితిన్ కి షూటింగ్ లేదని, కేవలం సాకుగా ఆరోగ్యం గురించి చెబుతున్నారని, కెరీర్ ప్రారంభంలో డాన్స్ రాని తనకు ఆ మెళకువలు నేర్పిస్తే ఇప్పుడు ఆ కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. నితిన్ గతంలో అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలోనే టక్కరి సినిమా చేశాడు. అఫ్కోర్స్ అది డిజాస్టర్ కావడం వేరే సంగతి.
మొత్తానికి జీరో బజ్ ఉన్న ఈ మూవీకి ఇపుడీ కామెంట్స్ వల్ల సోషల్ మీడియాలో గుర్తింపు వచ్చేసింది. అలా అని థియేటర్లకు జనం పొలోమని వస్తారని కాదు కానీ కనీసం ఇదొకటి ఉందన్న విషయమైతే గుర్తుకు వచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే దీనికి తమన్ సంగీతం సమకూర్చారట. అసలు తమన్ ఎప్పుడూ దీని గురించి ప్రస్తావన తీసుకురావడం కానీ దానికి సంబంధించిన మ్యూజిక్ అప్ డేట్స్ ఇవ్వడం కానీ జరగలేదు. మరి ఈ హైయ్ ఫైవ్ ఎప్పుడు చేశారో ఏమిటో. పెద్ద సినిమాలకే ఓపెనింగ్స్ రాని పరిస్థితుల్లో దీన్ని జనం థియేటర్లలో చూస్తారా.
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…