డాన్స్ మాస్టర్ గా టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ గుర్తింపే ఉన్న అమ్మ రాజశేఖర్ కు హీరో నితిన్ మీద కోపమొచ్చింది. సాధారణంగా టెక్నీషియన్ ఎవరైనా సరే పబ్లిక్ స్టేజిల మీద స్టార్లను విమర్శించేందుకు ఆలోచించే పరిస్థితుల్లో నేరుగా తిట్ల బాణాలు గుప్పించడం మీడియాకు సైతం షాక్ కలిగించింది. విషయంలోకి వెళ్తే అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో హైయ్ ఫైవ్ అనే సినిమా రూపొందింది. దీన్ని ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు. ఎప్పుడు తీశారో ఎవరు నటించారో కూడా తెలియనంత గప్ చుప్ గా షూటింగ్ జరిగింది.
నిన్న దీని తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అమ్మ రాజశేఖర్ పది రోజుల క్రితం నితిన్ ని అతిథిగా పిలిచాడు. అతనూ వస్తానని మాటిచ్చాడు. తీరా చూస్తే జ్వరమని చెప్పి చివరి నిమిషంలో నిస్సహాయత వ్యక్తం చేశాడు. ఇందులో నిజం లేదంటున్నాడు రాజశేఖర్. గత రెండు వారాలుగా నితిన్ కి షూటింగ్ లేదని, కేవలం సాకుగా ఆరోగ్యం గురించి చెబుతున్నారని, కెరీర్ ప్రారంభంలో డాన్స్ రాని తనకు ఆ మెళకువలు నేర్పిస్తే ఇప్పుడు ఆ కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. నితిన్ గతంలో అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలోనే టక్కరి సినిమా చేశాడు. అఫ్కోర్స్ అది డిజాస్టర్ కావడం వేరే సంగతి.
మొత్తానికి జీరో బజ్ ఉన్న ఈ మూవీకి ఇపుడీ కామెంట్స్ వల్ల సోషల్ మీడియాలో గుర్తింపు వచ్చేసింది. అలా అని థియేటర్లకు జనం పొలోమని వస్తారని కాదు కానీ కనీసం ఇదొకటి ఉందన్న విషయమైతే గుర్తుకు వచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే దీనికి తమన్ సంగీతం సమకూర్చారట. అసలు తమన్ ఎప్పుడూ దీని గురించి ప్రస్తావన తీసుకురావడం కానీ దానికి సంబంధించిన మ్యూజిక్ అప్ డేట్స్ ఇవ్వడం కానీ జరగలేదు. మరి ఈ హైయ్ ఫైవ్ ఎప్పుడు చేశారో ఏమిటో. పెద్ద సినిమాలకే ఓపెనింగ్స్ రాని పరిస్థితుల్లో దీన్ని జనం థియేటర్లలో చూస్తారా.
ఈ నెల 19న జరిగే ఉగాది తర్వాత ఏ క్షణమైనా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన…
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని…
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…