మా సినిమాకు టికెట్ రేట్లు తక్కువ అని పోస్టర్ల మీద వేసుకుని, ప్రెస్ మీట్లలో ఘనంగా ప్రకటించుకుని సినిమాలు రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కొవిడ్ తర్వాత మారిన పరిస్థితుల్లో ఇది అనివార్యం అయింది. ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా అని అయిన కాడికి రేట్లు పెంచేసి.. జనాలకు థియేటర్ల పట్ల విముఖత పెంచేస్తున్నారు.
ఓవైపు కొవిడ్ వల్ల థియేటర్లకు వెళ్లే అలవాటు తప్పడం, పైగా ఓటీటీలో బోలెడంత కంటెంట్ అందుబాటులో ఉండడంతో ఇప్పటికే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గగా.. ఇప్పుడు అధిక రేట్లు వారిని మరింత వెనక్కి లాగుతున్నాయి. ఈ ప్రభావం కొన్ని పెద్ద సినిమాల మీదా గట్టిగా పడడంతో ఈ మధ్య చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు రేట్లు తగ్గించడం తెలిసిందే. అయినా సరే.. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెద్దగా పెరిగినట్లు కనిపించడం లేదు. సినిమా చాలా బాగుందంటే తప్ప జనం రావట్లేదు.
ఇలాంటి తరుణంలో రామ్ లాంటి మిడ్ రేంజ్ హీరో నటించిన ది వారియర్ సినిమాకు పెట్టిన టికెట్ల ధరలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. హైదరాబాద్లోని మల్టీప్లెక్సులు అన్నింట్లోనూ ఈ చిత్రానికి రూ.295 రేటు ఫిక్స్ చేశారు. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు కలిపితే రేటు 330 అవుతోంది. సింగిల్ స్క్రీన్ల ధర రూ.175గా ఉంది. ఛార్జీలతో కలిపితే 200 దాటుతోంది. ఈ రేంజ్ సినిమాకు సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో 200 ధరలైతే రీజనబుల్ అనిపిస్తాయి.
హైదరాబాద్ లాంటి సిటీల్లో సింగిల్ స్క్రీన్లతో సమానంగా మల్టీప్లెక్స్ స్క్రీన్లున్నాయి. జనం కూడా క్వాలిటీ, క్లారిటీ కోసం వాటికి బాగానే వెళ్తున్నారు. కానీ ఈ సినిమాకు పెట్టిన రేటు చాలా ఎక్కువ అనే అభిప్రాయం వారిలో ఉంది. రామ్ సినిమా అంటే యూత్, ఫ్యామిలీస్ బాగానే థియేటర్లకు వస్తారు. కానీ ఈ రేటుతో అంటే ఫ్యామిలీస్కు చాలా కష్టం. యూత్ కూడా ఆలోచిస్తారు. సింగిల్ స్క్రీన్లలో సైతం రూ.200తో టికెట్ బుక్ చేయాలంటే ఇబ్బందే. మరి రీజనబుల్ రేట్లతో ఎక్కువమంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశాన్ని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు వదులుకుంటున్నారన్నది అర్థం కాని విషయం.
This post was last modified on July 10, 2022 10:03 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…