టాలీవుడ్ హీరోయిన్లలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, అలాగే సొంతంగా మంచి మార్కెట్ కూడా ఉన్న కథానాయికల్లో సమంత ఒకరు. ఆమె ఇప్పటికే ఓ బేబీ, యుటర్న్ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటుకుంది. ఆ సినిమాలకు వచ్చిన స్పందన చూసే సీనియర్ దర్శకుడు గుణశేఖర్ సామ్ ప్రధాన పాత్రలో శాకుంతలం అనే భారీ చిత్రం తలపెట్టాడు. చరిత్రలో బాగా పాపులర్ అయిన శకుంతల దుష్యంతుల ప్రేమగాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది.
ఇంతకుముందు రుద్రమదేవి సినిమాతో పెద్ద రిస్క్ చేసి అతి కష్టం మీద బయటపడిన గుణశేఖర్.. శాకుంతలం కోసం అలాంటి సాహసమే చేశాడు. ఆయనకు అగ్ర నిర్మాత దిల్ రాజు అండగా నిలిచాడు. ఐతే ఈ సినిమా చిత్రీకరణ గత ఏడాదే పూర్తయింది. సమంత ఈ చిత్రం నుంచి రిలీవ్ అయి వేరే చిత్రాల్లో నటిస్తోంది. కానీ ఎంతకీ శాకుంతలం రిలీజ్ సంగతే తేలట్లేదు.
శాకుంతలం సినిమా గురించి జనం మరిచిపోయి చాలా కాలం అయింది. ఎంత విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడ్డ సినిమా అయినా, పోస్ట్ ప్రొడక్షన్ పని ఎక్కువ ఉన్నా సరే.. మరీ ఇంత సమయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కనీసం అప్పుడప్పుడూ అప్డేట్స్ అయినా ఇవ్వడం, సినిమా నుంచి ఏవైనా విశేషాలు పంచుకోవడం చేయాలి. కానీ శాకుంతలం టీం అలాంటిదేమీ చేయడం లేదు. సమంత కూడా ఈ సినిమాను పట్టించుకోకుండా వదిలేసింది. దీంతో ఆమె అభిమానుల్లో కూడా ఈ సినిమా పట్ల ఆసక్తి పోయింది.
ఐతే ఓ అభిమాని తాజాగా ఇన్స్టాగ్రామ్లో నిర్మాత నీలిమ గుణను శాకుంతలం సినిమా గురించి అడగ్గా.. ఫస్ట్ టీజర్, ఇతర అప్డేట్స్ అతి త్వరలో రాబోతున్నాయని వెల్లడించింది. ఈ సినిమా ఈ ఏడాది వస్తుందా.. వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారా అని అడిగితే.. ఈ ఏడాదే అని కూడా బదులిచ్చింది. ఎట్టకేలకు శాకుంతలం టీం నుంచి కదలిక రావడంతో ఇకనైనా సినిమాను సరిగ్గా ప్రమోట్ చేసి సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేస్తారేమో చూడాలి.
This post was last modified on July 10, 2022 10:00 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…