బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే ‘అందాల రాక్షసి’ సినిమా ఫ్లాపే. మామూలుగా తొలి సినిమా ఫ్లాప్ అయిన హీరోయిన్లను ఇండస్ట్రీ అంతగా పట్టించుకోదు. కానీ లావణ్య త్రిపాఠి విషయంలో దీనికి భిన్నంగా జరిగింది. ఆ సినిమాలో ఆమె అందానికి కుర్రకారు ఫిదా అయిపోయింది. రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్లకు భిన్నంగా కనిపిస్తూ ముగ్ధమనోహరమైన అందంతో యూత్కు పిచ్చెక్కించేసింది లావణ్య. ఆ తర్వాత ఆమెకు అవకాశాలకు లోటు లేకపోయింది. దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా, శ్రీరస్తు శుభమస్తు లాంటి డీసెంట్ హిట్లు పడ్డాయి లావణ్యకు. కాకపోతే పెద్ద స్టార్ల సరసన, భారీ చిత్రాల్లో అవకాశాలు రాలేదన్నదే ఆమెకు లోటు.
కెరీర్లో తర్వాత ఆ దశకు కూడా చేరుతుందిలే అనుకుంటే.. ఉన్న స్థానాన్ని కోల్పోయిందామె. ఎలాంటి కథానాయికకు అయినా అప్పుడప్పుడూ ఓ హిట్ అవసరం. వరుసగా ఫ్లాపులు వస్తే డిమాండ్ తగ్గిపోతుంది. అవకాశాలు ఆగిపోతాయి. లావణ్య పరిస్థితి కూడా అలాగే తయారైంది.
ఎ1 ఎక్స్ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాల తర్వాత లావణ్య కెరీర్ మరీ డల్లయిపోయింది. ఇలాంటి టైంలో ఆమెకు మంచి హిట్ ఒకటి అవసరం అయింది. ఆ లోటును ‘హ్యాపీ బర్త్ డే’ తీరుస్తుందని ఆశించింది లావణ్య. కెరీర్లో తొలిసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ టచ్ ఉన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నందుకు ఆమె చాలా ఎగ్జైట్ అయింది కూడా. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రాణా రూపొందించిన ఈ చిత్రం వెరైటీ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కానీ కేవలం ప్రచార హడావుడి తప్ప సినిమాలో విషయం లేదని థియేటర్లకు వెళ్లాక కానీ తెలియలేదు.
తొలి రోజే డల్ ఓపెనింగ్స్తో మొదలైన ఈ చిత్రం.. నెగెటివ్ టాక్, వర్షాల ప్రభావంతో ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. వీకెండ్లోనే సినిమా ప్రభావం చూపలేదు. ఇక సోమవారం నుంచి షోలు రన్ కావడం కూడా కష్టమే. ఈ చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రమోషన్ల పరంగా ఎంతో కష్టపడ్డ లావణ్యకు ఇది పెద్ద షాకే. ఈ దెబ్బతో ఇక ఆమె కెరీర్ క్లోజ్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆమెను రక్షించేదెవరో?
This post was last modified on July 10, 2022 9:51 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…