మూడేళ్ళ క్రితం కర్ణాటకలో తప్ప బయట అంతగా ఎవరికి తెలియని నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ కెజిఎఫ్ పుణ్యమాని ప్యాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించేసుకుంది. అది కురిపించిన కనకవర్షం వల్లే ప్రభాస్ తో సలార్ లాంటి గ్రాండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. ఇది కాకుండా అటు మలయాళం ఇటు తమిళంలోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా పృథ్విరాజ్ సుకుమారన్ తో ఆల్రెడీ ఓ సినిమా స్టార్ చేశారు
మరోవైపు ఇంకో భారీ మల్టీ స్టారర్ ని త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. సూర్య దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. దీనికి దర్శకురాలు సుధా కొంగర. ఇది గతంలోనే అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ కాంబినేషన్ గురించి చెప్పలేదు. తాజాగా లీకైన అప్డేట్ ని బట్టి చూస్తే ఇందులో దుల్కర్ భాగమవ్వడం ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యింది. ఆకాశం నీ హద్దురాలో సుధా కొంగర టేకింగ్ కు ఫిదా అయిపోయిన సూర్య ఆవిడ అడగ్గానే కథ కూడా వినకుండా ఓకే చెప్పారట.
ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. బడ్జెట్ కూడా పెద్ద స్కేల్ లోనే ఉండబోతోంది. ఆ మధ్య వరస ఫ్లాపులతో సతమతమైన సూర్యకు ఆకాశం నీ హద్దురా, జైభీమ్ లు ఓటిటిలో వచ్చినప్పటికీ వాటికి వచ్చిన స్పందన బోలెడు ఎనర్జీ ఇచ్చింది. ఈటి తెలుగులో డిజాస్టర్ అయ్యింది కానీ తమిళంలో ఓ మోస్తరుగా కమర్షియల్ సేఫ్ అనిపించుకుంది. ఇక దుల్కర్ సీతా రామమ్ తో సోలో హీరోగా టాలీవుడ్ డెబ్యూ చేయబోతున్నాడు. ఈ కాంబో అంటే టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంటుందని వేరే చెప్పాలా.
This post was last modified on July 10, 2022 11:51 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…