‘సిసింద్రీ’ సినిమాతో చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ సంపాదించి.. పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం చేయడానికి ముందే యూత్లో ఫాలోయింగ్ సంపాదించుకుని తనపై భారీ అంచనాలు నెలకొనేలా చేసిన కుర్రాడు అక్కినేని అఖిల్. హీరోగా తన తొలి చిత్రం ‘అఖిల్’ మీద అంచనాలు మామూలుగా లేవు అప్పట్లో. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాల ఫలితాల గురించీ తెలిసిందే. వరుసగా మూడు డిజాస్టర్లతో వచ్చిన క్రేజ్ అంతా పోగొట్టుకుని క్రాస్ రోడ్స్లో నిలబడ్డాడు అక్కినేని వారసుడు.
ఇలాంటి స్థితిలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ అతడి కోసం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాను సెట్ చేశాడు. ఆ సినిమా కూడా డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. చివరికి బాక్సాఫీస్ దగ్గర పాసైపోయింది. అఖిల్ ఖాతాలో తొలి హిట్ చేరింది. ఇప్పుడు అక్కినేని వారసుడి ఆశలు ‘ఏజెంట్’ మీద ఉన్నాయి. కానీ ఈ సినిమా విడుదలలో ఆలస్యం జరుగుతోంది. ఈ లోపు అఖిల్ కొత్త సినిమా గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.
వరుసగా అఖిల్ సినిమాల కోసం పెద్ద పెద్ద నిర్మాతల్ని సెట్ చేస్తున్న నాగార్జున.. ఈసారి చిన్న కొడుకుని దిల్ రాజు చేతుల్లో పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. రాజుతో నాగ్కు మంచి అనుబంధమే ఉంది. ఆయన పెద్ద కొడుకు నాగచైతన్యను హీరోగా పరిచయం చేసింది దిల్ రాజు. ఇప్పుడు చైతూతో ‘థ్యాంక్ యు’ సినిమా కూడా తీశాడు. ఇప్పుడు అఖిల్ కొత్త సినిమాను నిర్మించడానికి ఆయన ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
‘వకీల్ సాబ్’ విజయాన్నందుకున్నప్పటికీ.. తాను కోరకున్న స్థాయిలో పెద్ద హీరోతో సినిమా చేయలేకపోయిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అఖిల్ సినిమాను రాజు ప్రొడ్యూస్ చేయనున్నాడట. ‘వకీల్ సాబ్’ తర్వాత అల్లు అర్జున్తో ‘ఐకాన్’కు రంగం సిద్ధం చేసినప్పటికీ అది వర్కవుట్ కాలేదు. వేరే స్టార్లను ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని అఖిల్ కోసం కథ రెడీ చేశాడట వేణు. దిల్ రాజు ఈ కథకు ఓకే చెప్పడం, అఖిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే సినిమా పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on July 9, 2022 7:08 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…