‘సిసింద్రీ’ సినిమాతో చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ సంపాదించి.. పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం చేయడానికి ముందే యూత్లో ఫాలోయింగ్ సంపాదించుకుని తనపై భారీ అంచనాలు నెలకొనేలా చేసిన కుర్రాడు అక్కినేని అఖిల్. హీరోగా తన తొలి చిత్రం ‘అఖిల్’ మీద అంచనాలు మామూలుగా లేవు అప్పట్లో. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాల ఫలితాల గురించీ తెలిసిందే. వరుసగా మూడు డిజాస్టర్లతో వచ్చిన క్రేజ్ అంతా పోగొట్టుకుని క్రాస్ రోడ్స్లో నిలబడ్డాడు అక్కినేని వారసుడు.
ఇలాంటి స్థితిలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ అతడి కోసం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాను సెట్ చేశాడు. ఆ సినిమా కూడా డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. చివరికి బాక్సాఫీస్ దగ్గర పాసైపోయింది. అఖిల్ ఖాతాలో తొలి హిట్ చేరింది. ఇప్పుడు అక్కినేని వారసుడి ఆశలు ‘ఏజెంట్’ మీద ఉన్నాయి. కానీ ఈ సినిమా విడుదలలో ఆలస్యం జరుగుతోంది. ఈ లోపు అఖిల్ కొత్త సినిమా గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.
వరుసగా అఖిల్ సినిమాల కోసం పెద్ద పెద్ద నిర్మాతల్ని సెట్ చేస్తున్న నాగార్జున.. ఈసారి చిన్న కొడుకుని దిల్ రాజు చేతుల్లో పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. రాజుతో నాగ్కు మంచి అనుబంధమే ఉంది. ఆయన పెద్ద కొడుకు నాగచైతన్యను హీరోగా పరిచయం చేసింది దిల్ రాజు. ఇప్పుడు చైతూతో ‘థ్యాంక్ యు’ సినిమా కూడా తీశాడు. ఇప్పుడు అఖిల్ కొత్త సినిమాను నిర్మించడానికి ఆయన ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
‘వకీల్ సాబ్’ విజయాన్నందుకున్నప్పటికీ.. తాను కోరకున్న స్థాయిలో పెద్ద హీరోతో సినిమా చేయలేకపోయిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అఖిల్ సినిమాను రాజు ప్రొడ్యూస్ చేయనున్నాడట. ‘వకీల్ సాబ్’ తర్వాత అల్లు అర్జున్తో ‘ఐకాన్’కు రంగం సిద్ధం చేసినప్పటికీ అది వర్కవుట్ కాలేదు. వేరే స్టార్లను ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని అఖిల్ కోసం కథ రెడీ చేశాడట వేణు. దిల్ రాజు ఈ కథకు ఓకే చెప్పడం, అఖిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే సినిమా పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…