‘సిసింద్రీ’ సినిమాతో చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ సంపాదించి.. పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం చేయడానికి ముందే యూత్లో ఫాలోయింగ్ సంపాదించుకుని తనపై భారీ అంచనాలు నెలకొనేలా చేసిన కుర్రాడు అక్కినేని అఖిల్. హీరోగా తన తొలి చిత్రం ‘అఖిల్’ మీద అంచనాలు మామూలుగా లేవు అప్పట్లో. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాల ఫలితాల గురించీ తెలిసిందే. వరుసగా మూడు డిజాస్టర్లతో వచ్చిన క్రేజ్ అంతా పోగొట్టుకుని క్రాస్ రోడ్స్లో నిలబడ్డాడు అక్కినేని వారసుడు.
ఇలాంటి స్థితిలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ అతడి కోసం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాను సెట్ చేశాడు. ఆ సినిమా కూడా డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. చివరికి బాక్సాఫీస్ దగ్గర పాసైపోయింది. అఖిల్ ఖాతాలో తొలి హిట్ చేరింది. ఇప్పుడు అక్కినేని వారసుడి ఆశలు ‘ఏజెంట్’ మీద ఉన్నాయి. కానీ ఈ సినిమా విడుదలలో ఆలస్యం జరుగుతోంది. ఈ లోపు అఖిల్ కొత్త సినిమా గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.
వరుసగా అఖిల్ సినిమాల కోసం పెద్ద పెద్ద నిర్మాతల్ని సెట్ చేస్తున్న నాగార్జున.. ఈసారి చిన్న కొడుకుని దిల్ రాజు చేతుల్లో పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. రాజుతో నాగ్కు మంచి అనుబంధమే ఉంది. ఆయన పెద్ద కొడుకు నాగచైతన్యను హీరోగా పరిచయం చేసింది దిల్ రాజు. ఇప్పుడు చైతూతో ‘థ్యాంక్ యు’ సినిమా కూడా తీశాడు. ఇప్పుడు అఖిల్ కొత్త సినిమాను నిర్మించడానికి ఆయన ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
‘వకీల్ సాబ్’ విజయాన్నందుకున్నప్పటికీ.. తాను కోరకున్న స్థాయిలో పెద్ద హీరోతో సినిమా చేయలేకపోయిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అఖిల్ సినిమాను రాజు ప్రొడ్యూస్ చేయనున్నాడట. ‘వకీల్ సాబ్’ తర్వాత అల్లు అర్జున్తో ‘ఐకాన్’కు రంగం సిద్ధం చేసినప్పటికీ అది వర్కవుట్ కాలేదు. వేరే స్టార్లను ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని అఖిల్ కోసం కథ రెడీ చేశాడట వేణు. దిల్ రాజు ఈ కథకు ఓకే చెప్పడం, అఖిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే సినిమా పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on July 9, 2022 7:08 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…